- Home
- Business
- సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుందా? రూ.56,100 జీతం వచ్చే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది
సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుందా? రూ.56,100 జీతం వచ్చే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది
Indian Army: సైన్యంలో చేరి దేశం కోసం పోరాడాలని ఉందా? ఇండియన్ ఆర్మీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగం మీకు వస్తే మీ కెరీర్ మంచి జీతంతో ప్రారంభమవుతుంది. ఇండియన్ ఆర్మీ నుంచి విడుదలైన నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
భారతీయ సైన్యంలో చేరాలనుకునే యువతకు ఇది అద్భుతమైన అవకాశం. 2025 సంవత్సరానికి 142వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC-142) కి సంబంధించిన నోటిఫికేషన్ ను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఈ ఉద్యోగానికి అర్హులు. బీఈ, బీటెక్ పూర్తి చేసినవారు లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 30 ఉద్యోగాలను పూరిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుండి రూ.1,77,500 వరకు జీతం లభిస్తుంది. కేవలం ఇంజినీరింగ్ చేసిన వారు ఇంత మంచి శాలరీ సంపాదించడం, అందులోనూ ఇండియన్ ఆర్మీలో చేరడం అంటే మాటలు కాదు.
ఈ అర్హతలు ఉండాలి
దరఖాస్తుదారులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు లేదా చివరి సంవత్సరం విద్యార్థులు అయి ఉండాలి. వయస్సు 20 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు లేదు. కేవలం పైన తెలిపిన అర్హతలు ఉంటే చాలు.
ఎంపిక ప్రక్రియ
దరఖాస్తుదారులను షార్ట్ లిస్ట్ చేసి, SSB ఇంటర్వ్యూకి పిలుస్తారు. దీని ద్వారా అర్హులైన వ్యక్తులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. 30.04.2025 నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 29.05.2025. ఆ రోజు సాయంత్రం 03.00 గంటల వరకు మాత్రమే అప్లికేషన్స్ స్వీకరిస్తారు. తర్వాత తీసుకోరు.
ముఖ్య గమనిక
దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్లోని అన్ని అర్హతలను జాగ్రత్తగా చదివి నిర్ధారించుకోండి. భారతీయ సైన్యంలో చేరి దేశసేవ చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ అర్హతలు, ఆసక్తి ఉంటేనే అప్లై చేయండి. ఇందులో ఎలాంటి లాబీయింగ్ కి అవకాశం ఉండదు. దేశానికి సేవ చేయాలన్న తపన ఉంటేనే ముందుకు రండి.