జగన్ అల్లుడి సందడి: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 10, 2019, 6:29 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

పరిటాల ఫ్యామిలీకి ధర్మవరం బాధ్యతలు: కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గం బాధ్యతలు పరిటాల సునీత కుటుంబానికి అప్పగించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆనియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఎవడు పడితే వాడు వచ్చి రాజకీయాలు చేసేందుకు ఇదేమైనా కనపర్తా అంటూ నిలదీశారు. 
 

 

హాట్ టాపిక్ : సీఎం జగన్ రాజకీయ వారసుడు ఎవరంటే.....

ఆకస్మాత్తుగా వైయస్ జయంతి ఉత్సవాల్లో రాజారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో వైయస్ జగన్ వారసుడు రాజారెడ్డి అంటూ ప్రచారం జరుగుతోంది. సీఎం వైయస్ జగన్ కు కుమారులు లేరు. ఇద్దరు కుమార్తెలే. దాంతో వైయస్ షర్మిల తనయుడు రాజారెడ్డియే వైయస్ జగన్ వారసుడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 
 

 

కవిత ఓటమి ఎఫెక్ట్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీకి డిఎస్?

మాజీ  పీసీసీ నేత, టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకావడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  పార్టీ కార్యక్రమాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు.
 

 

రాంప్రసాద్ హత్య కేసులో మరో ట్విస్ట్: బాస్ కళ్లలో ఆనందం కోసమే

 ప్రముఖ వ్యాపార వేత్త రాంప్రసాద్‌ను హత్య చేసేందుకు కోగంటి సత్యం, ఆయన అనుచరుడు శ్యామ్‌లు  సుఫారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నట్టుగా హైద్రాబాద్ పోలీసులు గుర్తించారు. తన బాస్ కళ్లలో ఆనందం చూసేందుకు శ్యామ్ ఈ కేసులో పాలుపంచుకొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
 

 

అప్పట్లో జగన్ ఫిర్యాదు: ఇప్పుడు సిబిఐ దాడులు, ఎవరీ బొల్లినేని గాంధీ?

గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లో పనిచేసిన గాంధీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులను దర్యాప్తు చేశారు. అదే విధంగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కంపెనీలపై కూడా దర్యాప్తు చేశారు.

 

 

కొడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే; రామ్ కామెంట్

 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా నటించిన ఇస్మార్ట్ శంకర్ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.  అయితే చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరికి ఈ సినిమా హిట్టవ్వడం చాలా అవసరం. గత కొన్నేళ్లుగా ప్లాప్స్ ఎదుర్కొంటున్న దర్శకుడు, హీరో, హీరోయిన్స్ ఇస్మార్ట్ శంకర్ పైనే ఆశలు పెట్టుకున్నారు. 

 

 

భార్య వదిలేయడంతో డ్రగ్స్ కి బానిసైన టాలీవుడ్ హీరో!

సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రకరకాల రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోన్న అనేక పుకార్లలో ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. అతడొక టాలెంటెడ్ హీరో.. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

రకుల్ ప్రీత్ సింగ్ స్మోకింగ్ కు బలైపోతున్న సెలెబ్రిటీ జంట!

తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్. యువతని ఆకట్టుకునే అందంతో పాటు నటన, చలాకీతనం ఉండడంతో రకుల్ కు స్టార్ హీరోల చిత్రాల్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. 

 

ఈషా రెబ్బా బికినీ షో.. అందుకే గ్లామర్ డోస్ పెంచుతోందా!

 

 

తెలుగు హీరోయిన్ గా ఈషా రెబ్బా చూడచక్కనైన రూపంతో ఆకట్టుకుంటోంది. కానీ కమర్షియల్ చిత్రాల్లో ఈషా రెబ్బకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. నటిగా కూడా ఈషా రెబ్బా ప్రూవ్ చేసుకుంది. స్టార్ హీరోయిన్ స్థాయికి ఆమె చేరుకోకపోవడానికి కారణం గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండడమే అనే టాక్ ఉంది. 

 

కంగనాని బాయ్కాట్ చేస్తాం.. జర్నలిస్ట్ బెదిరింపు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఇటీవల ఆమె నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమాలో ఒక పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంగనా ఓ జర్నలిస్ట్ పై మండిపడింది. తను నటించిన 'మణికర్ణిక' సినిమా గురించి జస్టిన్ రావు అనే జర్నలిస్ట్ తప్పుగా రాశాడని అతడిని టార్గెట్ చేస్తూ కంగనా కామెంట్స్ చేసింది.

 

నాన్న డబ్బులు పోగొట్టాను.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొడుకు కామెంట్స్!

టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎన్నో పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ కూడా గాయకుడిగా దాదాపు 2500 పాటలు ఆలపించాడు.

 

 

పోకిరి తర్వాత తండ్రి పేరుతో మహేష్.. 'సరిలేరు నీకెవ్వరు'లో..

మహర్షి తర్వాత మహేష్ బాబు కొత్త చిత్రం ప్రారంభమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ కాశ్మీర్ లో ప్రారంభమైంది. 

 

ప్రపంచ కప్ సెమీస్: కివీస్ అదుర్స్...టీమిండియా ఖాతాలో చెత్త రికార్డు

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా ఓ  చెత్త రికార్డును నెలకొల్పింది. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత టాప్ ఆర్డర్ ను కివీస్ బౌలర్లు బెంబేలెత్తించాడు. దీంతో మొదటి పది ఓవర్లలో కోహ్లీ సేన నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం  24  పరుగులు మాత్రమే చేసింది. ఇలా ఈ ప్రపంచ కప్ టోర్నీలో మొదటి పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు సాధించిన చెత్త రికార్డు టీమిండియా ఖాతాలో చేరింది. 

 

నన్ను పిచ్చి బూతులు తిడుతున్నారు.. చిన్మయి కామెంట్స్!

దర్శకుడు సందీప్ వంగా, సింగర్ చిన్మయి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల సందీప్.. ఇద్దరు ప్రేమికుల మధ్య ఒకరినొకరు కొట్టుకునేంత స్వేచ్చలేకపోతే వారి మధ్య ప్రేమ ఉంటుందని తాను అనుకోనని ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.

 

ఇండియా-ఇంగ్లాండ్ మధ్యే ఫైనల్...దేవుడు మా డ్రెస్సింగ్ రూంలోనే: రవిశాస్త్రి

టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి ప్రపంచ కప్ ఫైనల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా  డ్రెస్సింగ్ రూంలో దేవుడు దర్శనమిస్తాడని...ఆయన కరణతో టీమిండియా గెలవడం ఖామయని పేర్కొన్నారు. 

 

మాధురీ, ఐశ్వర్యలతో పీటర్సన్.. ‘‘డోలా రే డోలా’’: వైరల్ అవుతున్న మిమ్

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ బ్యాట్ పట్టుకుని బాలీవుడ్ తారలు ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్‌తో డ్యాన్స్ వేశాడు. పీటర్సన్ ఏంటీ బాలీవుడ్ భామలతో ఆడి పాడటం ఏంటి అనుకుంటున్నారా..?

 

రాయుడూ నిర్ణయం వెనక్కి తీసుకో.. యువరాజ్ తండ్రి సూచన

ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవల క్రికెట్ కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా... రిటైర్మెంట్ విషయంలో అంబటి రాయుడు తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మరో క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సూచించారు.

 

ధోనీ బ్యాటింగ్‌పై విమర్శలు: మహీ 20 ఏళ్ల కుర్రాడు కాదన్న కపిల్

ప్రస్తుత ప్రపంచకప్‌లో దూకుడుగా ఆడలేకపోతున్న టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీపై పలువురు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

 

ప్రపంచ కప్ సెమీఫైనల్: పాండ్యా ఔట్...ఆరో వికెట్ కోల్పోయిన భారత్

వర్షం కారణంగా నిన్న(మంగళవారం) అర్థాంతరంగా ఆగిపోయిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యింది. న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 211 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి బ్యాటింగ్  చేస్తున్న సమయంలో వర్షం మ్యాచ్ ను అడ్డుకుంది. ఇలా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే వుండటంతో మ్యాచ్ ఇవాళ్టికి వాయిదా పడింది. దీంతో నిన్న ఎక్కడయితే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడినుండే ఇవాళ మ్యాచ్ ప్రారంభమయ్యింది.   

 

 

అపరిచిత మహిళకు మెసేజ్.. వివాదంలో ఇరుక్కున్న క్రికెటర్ షమీ

టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. షమీ తనకు మెసేజ్ చేస్తున్నాడంటూ ఓ మహిళ ఆరోపించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
 

 

 

click me!