Published : May 09, 2025, 06:46 AM IST

Telugu news live updates: India Pakistan war: సెలవులన్నీ క్యాన్సిల్.. అందరూ పనిచేయాల్సిందే. కేంద్రం ఆదేశాలు

సారాంశం

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్:  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్‌ లైవ్‌ న్యూస్‌ అప్డేట్స్‌  అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.. 

 
 

 

 

11:51 PM (IST) May 09

India Pakistan war: సెలవులన్నీ క్యాన్సిల్.. అందరూ పనిచేయాల్సిందే. కేంద్రం ఆదేశాలు

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. అన్ని ప్రాంతాలలో ఆరోగ్య సేవలు, అత్యవసర ప్రతిస్పందనలు అంతరాయం లేకుండా కొనసాగేలా చూస్తోంది.

పూర్తి కథనం చదవండి

11:24 PM (IST) May 09

India Pakistan War: పాక్ రక్షణ మంత్రి పిచ్చి మాటలు.. ఇండియా ఒంటరిగా మారిందంటూ

పాకిస్తాన్ రక్షణా మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్, ఇండియా ఒంటరిగా ఉందని, ఇజ్రాయెల్‌తో కలిసి ఇస్లాంకి వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. పాకిస్తాన్‌కి చాలా దేశాల మద్దతు ఉందని చెప్పుకున్నారు.

పూర్తి కథనం చదవండి

11:09 PM (IST) May 09

India Pakistan War: భయం వద్దు.. దేశంలో వాటి కొరత లేదు.. భ‌రోసా ఇచ్చిన కేంద్రం

భారతపాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య నిత్యావసరాల ధరల పెరగకుండా.. వాటి నిల్వలను సమీక్షించాలని.. బ్లాక్ మార్కెట్, దళారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.  భారత–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 
 

పూర్తి కథనం చదవండి

10:54 PM (IST) May 09

India Pakistan War: బ‌రితెగించిన పాకిస్థాన్‌.. ఎయిర్‌పోర్ట్‌, స్కూళ్లు, ఇళ్ల‌పై డ్రోన్ దాడులు

పాకిస్థాన్ బ‌రితెగిస్తోంది. పాకిస్థాన్‌లోని ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకొని భార‌త్ దాడులు నిర్వ‌హిస్తే. దీనికి ప్ర‌తీకారంగా పాకిస్థాన్ సామాన్యుల‌పై దాడికి దిగుతోంది. వ‌రుస‌గా రెండో రోజు పాకిస్థాన్ దాడుల‌కు దిగింది. తాజాగా శుక్ర‌వారం రాత్రి మ‌రోసారి డ్రోన్ దాడుల‌తో రెచ్చిపోయింది. 
 

పూర్తి కథనం చదవండి

10:23 PM (IST) May 09

India Pakistan War: పాకిస్థాన్ డ్రోన్ దాడులు.. జ‌మ్ములో టెన్ష‌న్‌, టెన్ష‌న్

జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపోరా ఎయిర్ బేస్ సమీపంలో భారీ పేలుళ్లు వినిపించాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో అలర్ట్ సైరన్లు మోగించారు. పెద్ద ఎత్తున విద్యుత్‌ నిలిచిపోయింది.
 

పూర్తి కథనం చదవండి

09:32 PM (IST) May 09

India Pakistan War : దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాలు మూసివేత... ఎప్పటివరకో తెలుసా?

భారత్‌ పై దాడికి పాక్ సైన్యం 400 డ్రోన్‌లను మోహరించగా భారత సైన్యం వాటిని కూల్చివేసింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా 24 విమానాశ్రయాలను మూసివేసారు. ఈ ఎయిర్ పోర్ట్స్ ఏవి? ఎన్నిరోజులు మూసేస్తారు? ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

09:32 PM (IST) May 09

India Pakistan War: మ‌ళ్లీ దాడులు మొద‌లు పెట్టిన పాక్‌.. ఆ ప్రాంతాల్లో బ్లాకవుట్

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు వెంట పాకిస్థాన్ తరఫు నుంచి డ్రోన్లు భారత భూభాగంలోకి చొచ్చుకువస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. తాజా దాడులతో పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
 

పూర్తి కథనం చదవండి

09:22 PM (IST) May 09

India Pakistan War : ఆపరేషన్ సిందూర్ కు పాక్ యువత మద్దతు

పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు సరైనదే అని ఆ దేశ యువతే ఒప్పుకుంటోంది. ముందుకు పాక్ దాడి మొదలుపెట్టింది... ఇప్పుడు ఇండియా దాడి చేస్తే శాంతి కావాలంటే ఎలా? 26 మంది చనిపోయినప్పుడు శాంతి ఎక్కడ ఉంది? అని ఓ పాక్ యువకుడు ప్రశ్నించాడు.  

పూర్తి కథనం చదవండి

08:51 PM (IST) May 09

Horoscope: ఈ రాశి వారికి ఇంట శుభకార్యాలు..వారికి మాత్రం బంధువులతో వివాదాలు

ఇంట శుభకార్యాలు, కొత్త అవకాశాలు కొన్ని రాశులకు లభించనున్నాయి. మరికొందరికి బంధువులతో వివాదాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.

పూర్తి కథనం చదవండి

08:51 PM (IST) May 09

Pawan Kalyan: వృద్ధురాలి కాళ్ల‌కు మొక్కి, క‌లిసి భోజ‌నం చేసిన ప‌వ‌న్.. ఎందుకంటే

పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వృద్ధురాలి ప్రేమకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. స్వ‌యంగా భోజ‌నం వ‌డ్డించి, చీర‌, డ‌బ్బుల‌ను అందించాడు ఏపీ డిప్యూటీ సీఎం. ఇంత‌కీ ప‌వ‌న్ ఈ ప‌ని చేయ‌డం వెన‌కాల అస‌లు కార‌ణంటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి

08:23 PM (IST) May 09

Indian Army: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇండియన్ ఆర్మీకి మద్ధతుగా ప్రాదేశిక సైన్యం.

పాకిస్తాన్‌తో ఉద్రిక్తత నేపథ్యంలో, భారతీయ సైన్యానికి మద్దతుగా ప్రాదేశిక సైన్యాన్ని మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్వచ్ఛంద సైనిక దళ సభ్యులు పౌర వృత్తుల్లో నిమగ్నమై, అత్యవసర పరిస్థితుల్లో సేవలందిస్తారు.

పూర్తి కథనం చదవండి

08:09 PM (IST) May 09

Telangana: ఇండియ‌న్ ఆర్మీకి అండ‌గా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..

భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ద్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. పాకిస్థాన్‌లోని ఉగ్ర‌వాద శిబిరాల‌పై ఇండియ‌న్ ఆర్మీ చేపట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ కొన‌సాగుతోంది. పాకిస్థాన్ దాడులను భార‌త ఆర్మీ ధీటుగా ఎదురుకుంటోంది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 
 

పూర్తి కథనం చదవండి

07:53 PM (IST) May 09

అందాల పోటీలు చూసేందుకు ఎగ‌బ‌డుతోన్న జ‌నాలు.. దెబ్బ‌కు వెబ్‌సైట్ నిలిపివేసిన అధికారులు

తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు శనివారం సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గురువారం నుంచే స్టేడియంలో రిహార్సల్స్ ఉత్సాహంగా సాగాయి. వివిధ దేశాల కంటెస్టెంట్లు అందమైన కాస్ట్యూమ్స్‌తో స్టేజ్‌పై తమ నడకలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
 

పూర్తి కథనం చదవండి

07:32 PM (IST) May 09

RTC Rules: బ‌స్సులో క‌ల్లు తీసుకెల్తే నేర‌మా.? ఆర్టీసీ నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయి

నల్లగొండ జిల్లా నకిరేకల్‌ వద్ద ఓ మహిళ కల్లు బాటిళ్లను ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కట్టంగూరులో జరుగుతున్న ఓ వేడుక కోసం ఈ కల్లు తీసుకెళ్లాలనుకున్న ఆమెను బస్సు కండక్టర్, డ్రైవర్ అడ్డుకున్నారు.  దీంతో బ‌స్సులో క‌ల్లు తీసుకెళ్ల‌డం నేర‌మా అన్న చ‌ర్చ మొద‌లైంది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి

06:54 PM (IST) May 09

Dawood Ibrahim: దావూద్ ఎక్కడ ఉన్నాడు.? భారత్, పాక్ ఉద్రిక్తలతో..

ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లో భయానక వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ కు చెందిన పలువురు ఉగ్రవాదులు, నేరస్థులు ఆ దేశాన్ని వీడి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. 

పూర్తి కథనం చదవండి

06:20 PM (IST) May 09

32 ఏళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ చేస్తున్న షారుఖ్ ఖాన్

షారుఖ్ ఖాన్ దీవానా సీక్వెల్: వస్తున్న నివేదికల ప్రకారం, షారుఖ్ ఖాన్ 32 ఏళ్ల నాటి బ్లాక్ బస్టర్ దీవానా సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమాతోనే షారుఖ్ ఖాన్ సినీరంగ ప్రవేశం చేశారు.

 

పూర్తి కథనం చదవండి

06:20 PM (IST) May 09

Andhra Pradesh: డిప్యూటీ క‌లెక్ట‌ర్‌ను త‌హ‌సీల్దార్‌గా డీమోట్ చేయండి.. సుప్రీం సంచ‌ల‌న తీర్పు

హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. ఏపీ డిప్యూటీ కలెక్టర్ను తహసీల్దార్‌గా డిగ్రేడ్ చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయని అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఒక డిప్యూటీ కలెక్టర్‌ను తహసీల్దార్ హోదాకు డీమోట్ చేయాలని . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 

పూర్తి కథనం చదవండి

06:01 PM (IST) May 09

Train Ticket: ట్రైన్ టికెట్‌ చిరిగిపోతే ప్రయాణం చేయొచ్చా? కొత్త టికెట్ కొనాలా? అధికారుల వివరణ ఇదే

Train Ticket: ఒకసారి టికెట్‌ కొనుగోలు చేసిన తర్వాత అది చిరిగిపోతే ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితి మీకెప్పుడైనా ఎదురైందా? ఒకవేళ భవిష్యత్తులో ఇలా జరిగితే చిరిగిపోయిన టికెట్ చెల్లుబాటు అవుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

05:56 PM (IST) May 09

రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క ఆదేశాలు.. సివిల్ డిఫెన్స్ చట్టంలో 11వరూల్ వినియోగించాలని సూచన

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారతదేశం ప్రతీకార చర్యలు చేపట్టింది. దీంతో, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు అత్యవసర ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

పూర్తి కథనం చదవండి

05:37 PM (IST) May 09

Operation sindoor: పాక్ దాడుల‌ను భార‌త్ ఎలా తిప్పికొట్టింది.. ఆపరేషన్ సిందూర్‌పై ప్రెస్ మీట్

భారత సైన్యం మరోసారి తన శౌర్యాన్ని చాటింది. పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్ దాడులు, కాల్పుల విరమణ ఉల్లంఘనలను విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘటనలు ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద చోటుచేసుకున్నాయి. ఈ స‌మ‌యంలో ఏం జ‌రిగింద‌న్న వివ‌రాల‌ను భార‌త సైన్యం, వాయుసేన‌, నౌకాద‌ళానికి సంబంధించిన‌ అధికారులు మీడియాకు వివ‌రించారు. 
 

పూర్తి కథనం చదవండి

05:09 PM (IST) May 09

స్టార్ హీరో తమ్ముడితో ఇంటిమేట్ సీన్స్, నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు అంటూ హీరోయిన్ కామెంట్స్

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది రాయల్స్‌’ సిరీస్ విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో, భూమి పెడ్నేకర్ చిత్రీకరణకు ముందు హీరో ఇషాన్ కట్టర్‌తో సాన్నిహిత్యం పెంచుకోవాలని చిత్ర బృందం సూచించిందని తెలిపింది.

పూర్తి కథనం చదవండి

05:02 PM (IST) May 09

IPL 2025: వీరికి ఇదే చివరి ఐపీఎల్.. వీడ్కోలు చెప్ప‌నున్న స్టార్ ప్లేయ‌ర్స్.?

భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వాయిదా పడిన విషయం తెలిసిందే.మొదట్లో నిరవధిక వాయిదా అన్నారు. కానీ మరో వారం రోజుల్లో మ్యాచ్ లు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో IPL 2025 తో కొంతమంది స్టార్ క్రికెటర్లు వీడ్కోలు పలకనున్నారని సమాచారం.  వారు ఎవరో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

04:56 PM (IST) May 09

ఇండియన్ ఆర్మీకి నా సెల్యూట్, మనందరం బాధ్యతగా ఉందాం.. హీరో యష్ కామెంట్స్

ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెలబ్రిటీలు భారత సైన్యానికి మద్దతు తెలియజేస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

04:37 PM (IST) May 09

IPL 2025: ఐపీఎల్ ల‌వ‌ర్స్‌కి గుడ్ న్యూస్‌.. నిర‌వ‌ధిక‌ వాయిదా కాదు, తిరిని ప్రారంభం ఎప్ప‌డంటే

భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లను వాయిదా వేసేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐపీఎల్ పాలక మండలి వెల్లడించింది. అయితే తొలుత ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను నిర‌వ‌ధిక వాయిదా వేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. 
 

పూర్తి కథనం చదవండి

04:31 PM (IST) May 09

ఆ యాడ్ కోసం సాయి పల్లవికి ఎన్ని కోట్లు ఆఫర్ చేశారో తెలుసా ? అబద్దాలు చెప్పి సంపాదించను అంటూ..  

800 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీత పాత్రను సాయి పల్లవి పోషించనున్నారు. 2 కోట్ల రూపాయల ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటనను ఆమె తిరస్కరించారు. విదేశాల్లో MBBS పూర్తి చేసిన ఆమె, వైద్య వృత్తిని కాకుండా నటనను ఎంచుకున్నారు.

పూర్తి కథనం చదవండి

04:14 PM (IST) May 09

ATMలలో ఉచితంగా ఎన్నిసార్లు డబ్బులు తీసుకోవచ్చు? కొత్త లిమిట్ ఇదే

పరిమితికి మించి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే ఛార్జ్ పడుతున్న విషయం చాలా మందికి తెలియదు. అవసరాల మేరకు 100, 200 కూడా ఏటీఎం కి వెళ్లి డ్రా చేసేస్తుంటారు. అయితే మే 1 నుండి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన కొత్త నిబంధనల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి

04:11 PM (IST) May 09

నీ ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం.. తెలుగు జవాన్ మృతిపై చంద్ర‌బాబు, లోకేష్ ట్వీట్

భార‌త్‌,పాకిస్థాన్‌ల మ‌ధ్య జ‌రుగుతోన్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రక్షణ కోసం పోరాడుతూ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందించారు.
 

పూర్తి కథనం చదవండి

04:00 PM (IST) May 09

ప్రముఖ నిర్మాత కుమార్తె పెళ్లి వేడుకలో సెలెబ్రిటీల సందడి.. వైరల్ ఫోటోస్ 

ప్రముఖ నిర్మాత ఐసరి గణేష్ తన కూతురు ప్రీత వివాహాన్ని చెన్నైలో ఘనంగా నిర్వహించారు. వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూర్తి కథనం చదవండి

03:51 PM (IST) May 09

BSNL మదర్స్ డే స్పెషల్: మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లపై డిస్కౌంట్ ఆఫర్లు

BSNL Mothers Day Offer: మదర్స్ డే సందర్భంగా BSNL తన మూడు బెస్ట్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్‌లపై డిస్కౌంట్ ప్రకటించింది. మాతృ దినోత్సవం మే 11న వస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని BSNL తన అధికారిక X ఖాతా ద్వారా మూడు రీఛార్జ్ ప్లాన్‌లపై 5 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

పూర్తి కథనం చదవండి

03:13 PM (IST) May 09

India Pakiatan War : భారత ఆర్మీకి అండగా ఉందాం : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాాడికోసం చేపట్టిన ఆపరేషన్ సిందూర్, ఆ తర్వాతి పరిణామాలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. ఈ మేరకు ఆయన దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. 

పూర్తి కథనం చదవండి

02:58 PM (IST) May 09

India Pakistan War : భారత ఆర్మీ చీఫ్ అదనపు అధికారాలు: కేంద్రం కీలక నిర్ణయం

పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత సైన్యాధిపతికి అదనపు అధికారాలను కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
 

పూర్తి కథనం చదవండి

02:51 PM (IST) May 09

స్టార్ హీరో రెండో పెళ్ళికి రెడీ అవుతున్నాడా.. ఆమెతో జంటగా వివాహ వేడుకలో సందడి

ఐసరి గణేష్ కూతురు పెళ్లికి నటుడు రవి మోహన్ కూడా హాజరయ్యారు. ఆయన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఒక మహిళతో కలిసి ఈ పెళ్లికి వచ్చారు.

పూర్తి కథనం చదవండి

02:34 PM (IST) May 09

India Pakistan War : ఈ ఒక్క ఫోటో చాలు... పాక్ పై భారత్ దే విజయమని చెప్పడానికి

భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణశాఖ కీలక సమావేశం నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీడీఎస్ తో పాటు ముగ్గురు సైనికాధిపతులతో సమావేశమయ్యారు. సైనికాధిపతులు యుద్ధ దుస్తుల్లో కనిపించారు. 

పూర్తి కథనం చదవండి

02:27 PM (IST) May 09

సాయిపల్లవి ఆస్తి విలువ ఎంతో తెలుసా.. ఆమె రెమ్యునరేషన్ ఇదే

నటి సాయి పల్లవి తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా, ఆమె ఆస్తుల విలువ ఎంతో ఈ కథనంలో తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

02:08 PM (IST) May 09

India Pakistan War : ఈ 10 నగరాలకు ఇండిగో విమానాలు రద్దు ... ఎప్పటివరకో తెలుసా?

ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఇండిగో 10 నగరాలకు విమానాల రాకపోకలను నిలిపివేసింది. ఆ నగరాలేవి? ఎప్పటివరకు ఈ ఎయిర్ పోర్ట్ కు ఇండిగో విమాన సర్వీసులు ఉండవు? అనేది ఇక్కడ తెలుసుకుందాం.  

పూర్తి కథనం చదవండి

01:57 PM (IST) May 09

ఆహా.. ఇకపై మీ ఊర్లో కూడా ఫుల్ ఇంటర్నెట్: స్టార్‌లింక్‌కు అనుమతిచ్చిన భారత ప్రభుత్వం

Starlink: దేశంలో టెలికాం సేవల్లో కీలక పరిమాణం ఇది. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు వేగంగా అందనున్నాయి. దీనికోసం ఎలాన్ మస్క్ సంస్థ అయిన స్టార్ లింక్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ పరిణామంతో జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ తదితర టెలికాం కంపెనీలు ఇరకాటంలో పడ్డాయి. ఏదిఏమైనా ఇకపై ప్రజలకు పోటాపోటీగా ఇంటర్నెట్ సేవలు అందుతాయన్న మాట. 

పూర్తి కథనం చదవండి

01:55 PM (IST) May 09

Operation Sindoor: సోఫియా ఖురేషి జీతమెంతో తెలుసా!

ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి జీవితం, కుటుంబం, జీతం వివరాలు తెలుసుకోండి

పూర్తి కథనం చదవండి

01:26 PM (IST) May 09

India Pakistan War : పాక్ తో పోరాటంలో వీరమరణం పొందిన తెలుగు జవాన్

పాకిస్థాన్ సేనలతో వీరోచితంగా పోరాడుతూ దేశం కోసం కోసం చివరకు తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు తెలుగు జవాన్ మురళీ నాయక్. జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్న అతడు యుద్దభూమిలో వీరమరణం పొందాడు. 

పూర్తి కథనం చదవండి

01:20 PM (IST) May 09

India Pakistan War: జోధ్‌పూర్‌లో బ్లాక్‌అవుట్‌..అంధకారంలోనే పెళ్లి వేడుకలు

భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో జోధ్‌పూర్‌లో ఓ పెళ్లి వేడుక రాత్రి 9:30 గంటలకే బ్లాక్‌అవుట్‌ కారణంగా అంధకారంలోకి వెళ్లిపోయింది. మొబైల్ ఫోన్ల వెలుతురులోనే అతిథులు భోజనం చేశారు, వధూవరులు మొబైల్ వెలుతురులోనే తలంబ్రాలు చేసుకున్నారు.

పూర్తి కథనం చదవండి

12:56 PM (IST) May 09

India Pakistan War : అయ్యాా... బాబు అంటూ అడుక్కుంటున్న పాకిస్థాన్

భారత్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ పరిస్థితి దిగజారింది. IMF నుండి చైనా, సౌదీ అరేబియా, UAE వరకు అన్ని దేశాల నుండి అప్పులు చేసింది. ఇప్పుడు మళ్ళీ మిత్రదేశాల నుండి అప్పులు అడుగుతోంది.

పూర్తి కథనం చదవండి

More Trending News