ATMలలో ఉచితంగా ఎన్నిసార్లు డబ్బులు తీసుకోవచ్చు? కొత్త లిమిట్ ఇదే
పరిమితికి మించి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే ఛార్జ్ పడుతున్న విషయం చాలా మందికి తెలియదు. అవసరాల మేరకు 100, 200 కూడా ఏటీఎం కి వెళ్లి డ్రా చేసేస్తుంటారు. అయితే మే 1 నుండి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన కొత్త నిబంధనల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ATM నుండి కొన్ని సార్లు మాత్రమే ఉచితంగా డబ్బులు తీసుకోవచ్చు. ఆ తర్వాత అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని చాలా మందికి తెలియదు. అయినా ప్రస్తుత బిజీ లైఫ్ లో డిజిటల్ పేమెంట్స్ నే ఎక్కువ మంది చేస్తున్నారు. రోడ్డు పక్కన టీ స్టాల్ అయినా, ఆటో, బస్సు ప్రయాణాలకు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. వేగవంతమైన లావాదేవీల కోసం ప్రజలు ఇప్పుడు UPI ద్వారా చెల్లించడానికి ఇష్టపడుతున్నారు.
ఇప్పటికీ డబ్బులు డ్రా చేస్తున్నారు
బ్యాంకులు ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్, ఇంటి వద్దకే వచ్చి కూడా సేవలను అందిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ రోజువారీ అవసరాల కోసం డబ్బు తీసుకోవడానికి చాలా మంది ఇప్పటికీ ATMలపై ఆధారపడుతున్నారు. ఎందుకంటే అప్పటికప్పుడు డబ్బు చేతికి వస్తుంది. ఏటీఎంలు 24/7 అందుబాటులో ఉంటాయి.
కానీ ATMలను వినియోగించుకోవడం పూర్తిగా ఉచితం కాదని చాలా మందికి తెలియదు. మీరు తరచుగా ATMల నుండి డబ్బులు తీసుకుంటే ఒక నెలలో మీరు ఎన్ని ఉచిత లావాదేవీలు చేయొచ్చు. పరిమితిని మించిపోతే ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మే 1, 2025 నుండి కొత్త ATM ఛార్జీలు
మే 1, 2025 నుండి ATM వినియోగానికి సంబంధించిన కొత్త నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమలులోకి తీసుకొచ్చింది. ఒక్కో బ్యాంకు ఒక్కోలా మనీ విత్ డ్రాయల్ కి లిమిట్ పెట్టాయి. వాటి లిమిట్ దాటితే ప్రత్యేక ఛార్జీ వసూలు చేస్తారు. ఇప్పుడు ఆ ఛార్జీలు పెంచారు.
గతంలో బ్యాంకులు పరిమితిని మించిన ఒక లావాదేవీకి రూ.21 వసూలు చేసేవి. కానీ కొత్త నిబంధన ప్రకారం ఈ ఛార్జీ ఇప్పుడు లావాదేవీకి రూ.23కి పెంచారు.
నగరాలను బట్టి ఛార్జ్ మారుతుంది
నెలకు ఉచిత ATM మనీ విత్ డ్రా సదుపాయాల సంఖ్య బ్యాంకును బట్టి, నగరాన్ని బట్టి కూడా మారుతుంది. మీరు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి మెట్రో నగరాల్లో నివసిస్తుంటే నెలకు మూడు ఉచిత ATM నగదు ఉపసంహరణలను పొందవచ్చు.
అయితే మీరు చిన్న నగరాలు లేదా మెట్రో కాని ప్రాంతాల్లో నివసిస్తుంటే మీరు నెలకు ఐదుసార్లు ఉచితంగా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ పరిమితిని మించిపోయిన తర్వాత ప్రతి అదనపు లావాదేవీకి కొత్త రూ.23 ఛార్జీ వర్తిస్తుంది.
బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్మెంట్
డబ్బులు తీసుకోవడానికి మాత్రమే ఛార్జీలు వర్తించవు. మీ బ్యాలెన్స్ను తనిఖీ చేయడానికి లేదా మినీ స్టేట్మెంట్ పొందడానికి మీరు మీ సొంత బ్యాంకు కాకుండా వేరే బ్యాంకు ATMని ఉపయోగిస్తే మీకు నామమాత్రపు ఛార్జీ కూడా విధిస్తారు.