IPL 2025: ఐపీఎల్ లవర్స్కి గుడ్ న్యూస్.. నిరవధిక వాయిదా కాదు, తిరిని ప్రారంభం ఎప్పడంటే
భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్లను వాయిదా వేసేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐపీఎల్ పాలక మండలి వెల్లడించింది. అయితే తొలుత ఐపీఎల్ మ్యాచ్లను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్లను వాయిదా వేసేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐపీఎల్ పాలక మండలి వెల్లడించింది. అయితే తొలుత ఐపీఎల్ మ్యాచ్లను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

దీంతో ఈ సీజన్ ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఇది నిరవధిక వాయిదా కాదని కేవలం వారం రోజుల పాటే వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఫ్రాంచైజీలు, ప్రసార హక్కుదారులు (బ్రాడ్కాస్టర్లు), స్పాన్సర్లతో నిర్వహించిన అత్యవసర సమావేశం అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుతం లీగ్లో ఇంకా 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.
IPL
గురువారం ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ మధ్యలోనే విద్యుత్ సరఫరా ఆపేయడంతో ఆట నిలిచిపోయింది. తొలుత ఇది సాంకేతిక లోపమని భావించారు. కానీ తరువాత భద్రతా కారణాల వల్లే విద్యుత్ కట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో బోర్డు తాత్కాలికంగా మ్యాచ్లను నిలిపివేయాలని నిర్ణయించింది.
అలాగే, భారత్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం కారణంగా విదేశీ ఆటగాళ్లు, ముఖ్యంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్లు స్వదేశానికి వెళ్లిపోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బోర్డు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ముందస్తు జాగ్రత్తగా వారం రోజుల పాటు మ్యాచ్లకు బ్రేక్ ఇచ్చామని, అనంతరం పరిస్థితిని బట్టి నిరవధిక వాయిదాపై నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. త్వరలోనే కొత్త షెడ్యూల్, మ్యాచ్ వేదికలపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
Eden Gardens (Photo: X/@IPL)
ఈ సందర్భంగా బీసీసీఐ ప్రకటనలో, ‘‘దేశ భద్రత కోసం ముందు వరుసలో నిలిచి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న భారత జవాన్లకు మా సల్యూట్. భారత సైన్యంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది’’ అని తెలిపింది.