
ట్రాక్టరెక్కి పొలం దున్నిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుగా అవతారమెత్తారు.
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుగా అవతారమెత్తారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో మంత్రి ట్రాక్టర్తో పొలం దున్ని, నాట్లు వేశారు. అంతేకాకుండా కుమారుడు ఎర్రబెల్లి ప్రేమ్చంద్కు వ్యవసాయంలో మెళకువలు తెలియజేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వస్తున్న నీటి కాలువలను పరిశీలించారు.
Add Asianetnews Telugu as a Preferred Source
