Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీ జయంతి వేడుక... మహాత్ముడికి స్పీకర్, మండలి చైర్మన్ నివాళి

హైదరాబాద్ : భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు నివాళి అర్పించారు.

హైదరాబాద్ : భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు నివాళి అర్పించారు. పూలతో అలంకరించిన గాంధీ విగ్రహంవద్దకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ అధికారులతో కలిసి చేరుకున్న స్పీకర్, మండలి ఛైర్మన్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మండలి ఛైర్మన్ మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్య్రం తేవడంకోసం ఆంగ్లేయులతో శాతియుత మార్గంలో పోరాడి గాంధీజి జీవితాన్ని త్యాగం చేసారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాగే గాంధేయ మార్గంలోనే స్వరాష్ట్రాన్ని సాధించారని గుత్తా పేర్కొన్నారు.