Asianet News TeluguAsianet News Telugu

నా కొడుకు ఏ తప్పూ చేయలేదు : టీఎస్ పిఎస్సి పేపర్లు లీక్ పై నిందితుడి తల్లి

జగిత్యాల : టీఎస్ పిఎస్సి పేపర్ల లీకేజీ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రశ్నపత్రాలను లీక్ చేసిన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, రేణుక తో మరో మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణకు సిట్ ఏర్పాటుచేసారు. 

జగిత్యాల : టీఎస్ పిఎస్సి పేపర్ల లీకేజీ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రశ్నపత్రాలను లీక్ చేసిన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, రేణుక తో మరో మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణకు సిట్ ఏర్పాటుచేసారు. అయితే ప్రధాన నిందితుల్లో ఒకడయిన రాజశేఖర్ తల్లి మాత్రం తన కొడుకు ఏ తప్పూ చేయలేడని అంటోంది. తన కొడుకు ఏ నేరమూ చేయలేదని... జైలునుండి చల్లగా బయటకు రావాలని కోరుకుంటున్నానని రాజశేఖర్ తల్లి పేర్కొన్నారు. 

జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో రాజశేఖర్ ఇంట్లో తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. ఏం చేసినా అమ్మా ఇది అని కొడుకు చెప్పేవాడని... పేపర్ లీకేజీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదని రాజశేఖర్ తల్లి తెలిపారు. ఆరేళ్లు అప్ఘానిస్తాన్ లో వున్నాడని... అప్పుడే ఇళ్లు కట్టుకున్నామని అన్నారు. విదేశాల నుండి తిరిగివచ్చాక ఎంతో కష్టపడి 2018 లో ఉద్యోగాన్ని సాధించాడని... అప్పటినుండి భార్యాబిడ్డలతో హైదరాబాద్ వుంటున్నాడని అన్నారు. పేపర్ లీక్ తో తన కొడుక్కి ఎలాంటి సంబంధం లేదని రాజశేఖర్ తల్లి స్పష్టం చేశారు.