Video: చంద్రబాబుకు మంగళహారతులు పట్టిన అమరావతి

అమరావతి ప్రజల రాజధాని ఉద్యమం 50రోజులకు చేరుకున్న సందర్భంగా రైతులు, మహిళలు చేపడుతున్న ధీక్షలో స్వయంగా పాల్గొనడానికి వచ్చిన మాజీ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. 

Share this Video

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలోనే వుండాలని డిమాండ్ చేస్తూ అక్కడి రైతులు, మహిళలు, సామాన్యులు గత 50రోజులుగా నిరసనల బాట పట్టారు. ఈ క్రమంలోనే వారు చేపట్టిన ధీక్షకు పలుమార్లు మద్దతు ప్రకటించిన టిడిపి అధినేత చంద్రబాబు మరోసారి వారికి మద్దతుగా నిలిచారు. దీక్షాస్థలికి చేరుకోంటున్న సమయంలో ఆయనకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంగళహారతులతో మహిళలు, కరతాళ ధ్వనులు, నినాదాలతో పురుషులు ఘన స్వాగతం పలికారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


Related Video