Video: గిట్టుబాటు ధరకోసం రోడ్డెక్కిన టమోటా రైతు
కర్నూల్ జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దళారులు రైతుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని రైతులు మండిపడ్డారు. గురువారం ఉదయం నుండి జత 500 నుంచి 600 కొనుగోలుచేసి మధ్యాహ్నం నుండి టమోటా గంపలు మార్కెట్ కు ఎక్కువ రావడంతో దళారులు టమోటా ధరను ఒక్కసారిగా తగ్గించేశారు. దీంతో రైతులు కోపోద్రిక్తులై రోడ్డెక్కారు. దాదాపు నాలుగు గంటల పాటు రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. మూడు కిలోమీటర్ల మేర రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
కర్నూల్ జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దళారులు రైతుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని రైతులు మండిపడ్డారు. గురువారం ఉదయం నుండి జత 500 నుంచి 600 కొనుగోలుచేసి మధ్యాహ్నం నుండి టమోటా గంపలు మార్కెట్ కు ఎక్కువ రావడంతో దళారులు టమోటా ధరను ఒక్కసారిగా తగ్గించేశారు. దీంతో రైతులు కోపోద్రిక్తులై రోడ్డెక్కారు. దాదాపు నాలుగు గంటల పాటు రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. మూడు కిలోమీటర్ల మేర రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.