పార్లమెంటులో బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ.. వక్ఫ్ బిల్లుపై ఏపీ పార్టీల తీరు ఇదే | Asianet Telugu
లోక్ సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతు పలికాయి. ఈ చట్ట సవరణ ముస్లిం సమాజానికి మేలు చేస్తుందని ఆ పార్టీలు పేర్కొన్నాయి. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు పార్లమెంటులో గళం వినిపించారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.