Asianet News TeluguAsianet News Telugu

కిడ్నాపర్ల చెరనుండి క్షేమంగా ఇంటికి ... బాలున్ని పరామర్శించిన మంత్రి రజని

చిలకలూరిపేట : తన సొంత నియోజకవర్గంలో అలజడి రేపిన బాలుడి కిడ్నాప్ వ్యవహారం సుఖాంతం కావడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి విడదల రజని పోలీసులను అభినందించారు.

చిలకలూరిపేట : తన సొంత నియోజకవర్గంలో అలజడి రేపిన బాలుడి కిడ్నాప్ వ్యవహారం సుఖాంతం కావడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి విడదల రజని పోలీసులను అభినందించారు. కిడ్నాప్ కు గురయిన రాజీవ్ సాయి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. బాలుడితో సరదాగా ముచ్చటించిన మంత్రి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే కేవలం గంటల వ్యవధిలోనే చిన్నారి ఆచూకీ కనిపెట్టి క్షేమంగా తల్లిదండ్రులకు చెంతకు చేర్చిన స్థానిక పోలీసులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.