AP Assembly Budget Session: తొలిరోజే అసెంబ్లీ నుంచి YS జగన్ వాకౌట్ | YSRCP | Asianet News Telugu
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం చేశారు. అధికార టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులతో పాటు వైసీపీ సభ్యులు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. అయితే, గవర్నర్ పట్టించుకోకుండానే తన ప్రసంగం కొనసాగించారు. దీంతో జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.