Asianet News TeluguAsianet News Telugu

సీన్ రివర్స్.. యువకుడి న్యూడ్ వీడియోలు తీసి వేధిస్తున్న యువతి..

ఇక్కడే ట్విస్ట్ మొదలయ్యింది. వీడియోలు పంపిన కాసేపటికే సదరు యువతి ఫ్లేట్ ఫిరాయించింది. అతని వీడియోను facebook లో పెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టింది. అనుకోని ఈ ఘటనతో యువకుడు షాక్ కు గురయ్యాడు. 

woman blackmailing a man with obscene whatsapp video in hyderabad
Author
Hyderabad, First Published Oct 14, 2021, 10:17 AM IST

బంజారా హిల్స్ : ఫేస్ బుక్ లో పరిచయమైన ఓ యువతి చాటింగ్ లో తన నగ్న వీడియోలు తీసి వేధింపులకు పాల్పడుతోందని బాధితుడు ఒకరు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్ నెం.12లోని భోలానగర్ లో నివసించే ఓ వ్యక్తి (32) ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నాడు. 

జూలై నెలలో సాక్షి వర్మారెడ్డి పేరుతో ఓ యువతి పరిచయం అయ్యింది. ఇద్దరూ స్నేహితులుగా మారి వాట్సాప్ చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. బాగా దగ్గరితనం వచ్చింది. ఈ క్రమంలో ఆ యువతి తన నగ్న వీడియోలు అతనికి పంపించింది. అతన్ని టెంప్ట్ చేసి.. బాధితుడిని కూడా నగ్నంగా ఉన్న వీడియోలు పెట్టాలని రెచ్చగొట్టింది. దీంతో అతడు ఆమె చెప్పినట్టుగా తన nude videos పంపాడు. 

అయితే ఇక్కడే ట్విస్ట్ మొదలయ్యింది. వీడియోలు పంపిన కాసేపటికే సదరు యువతి ఫ్లేట్ ఫిరాయించింది. అతని వీడియోను facebook లో పెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టింది. అనుకోని ఈ ఘటనతో యువకుడు షాక్ కు గురయ్యాడు. 

ఆ యువతి అంతటితో ఆగకుండా కొంతమందికి ఈ వీడియోను పంపించింది. అయినా అతను వినడం లేదనుకుందో ఏమో.. ఆత్మహత్య చేసుకుంటానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో బెదిరిపోయిన సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. 

చాంద్రాయణ గుట్టలో దారుణం

హైదరాబాద్, చాంద్రాయణ గుట్టలో దారుణం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని నరికి చంపారు దుండగులు. కారులో వెళ్తున్న వ్యక్తిని వెంటాడి చంపారు. కారుని అడ్డుకుని బాధితుడిని బయటకి లాక్కొచ్చి కత్తులతో విచక్షణారహితంగా నరికారు. ఆపై బండరాయితో కొట్టి అతనిని హత్య చేశారు. అతను చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్లారు. జనం చూస్తుండగానే హత్య చేసి పారిపోయారు దుండగులు. మృతుడిని మొగల్‌పురాకు చెందిన హమీద్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు  ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి  దర్యాపతు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కోడిగుడ్డు గొంతులో ఇరుక్కొని మహిళ మృతి

బిల్లు విషయంలో గొడవ.. కస్టమర్లను చితకబాది.. 

రాజేంద్రనగర్‌లోని భవానీ రెస్టారెంట్ అండ్ బార్ యాజమాన్యం రెచ్చిపోయింది. బార్‌కొచ్చిన కస్టమర్లను యాజమాన్యం చితకబాదింది. రెస్టారెంట్‌ బిల్లు చెల్లింపు విషయంలో చోటు చేసుకున్న వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కస్టమర్లపై వీధి రౌడిల్లా ప్రతాపం చూపింది యాజమాన్యం. కర్రలతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు యువకులు. 

ఈ ఘటనలో ముగ్గురు కస్టమర్లు తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడటంతో పాటు కొట్టుకుంటూ వారిని నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రాజేంద్ర నగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే బార్‌లో ఎలాంటి గొడవ జరగలేదని బార్ సిబ్బంది బుకాయించే ప్రయత్నం చేశారు. బార్ బయటే ఇరు వర్గాలు కొట్టుకున్నారంటూ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios