గాంధీ ఆసుపత్రిలో దారుణం: అక్కా చెల్లెళ్లపై రేప్, పోలీసులకు ఫిర్యాదు
చికిత్స కోసం వచ్చిన వ్యక్తికి తోడుగా ఉన్న అక్కా చెల్లెళ్లపై గాంధీ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.నాలుగు రోజుల పాటు మత్తుమందిచ్చి ఓ గదిలో బంధించి రేప్ చేశారని ఆమె ఆరోపించారు. తమ సోదరి ఆచూకీ లభ్యం కాలేదని కూడ ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకొంది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తితో పాటు అక్కా చెల్లెళ్లు గాంధీ ఆసుపత్రికి వచ్చారు.
అయితే ఆసుపత్రికి చికిత్సకు వచ్చిన అక్కాచెల్లెళ్లను ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులుా పనిచేసే ఇద్దరు వ్యక్తులు తమను ఓ గదిలో బంధించి అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.
మత్తుమందు ఇచ్చి తమపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించారు. తాను ఎలాగోలా నిందితుల నుండి తప్పించుకొని వచ్చినట్టుగా ఆమె చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అక్క ఆచూకీ లభ్యం కాలేదని ఆమె తెలిపారు.
ఈ విషయమై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన వ్యక్తికి తోడుగా ఉన్న ఇద్దరు మహిళలను బంధించినవారెవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.నాలుగు రోజుల పాటు అక్కా చెల్లెళ్లను నిందితులు ఎక్కడ ఉంచారని దర్యాప్తు చేస్తున్నారు.
మరో వైపు బాధితురాలి సోదరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆమె కోసం ఆరా తీస్తున్నారు. ఏ రోజు ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి నుండి నిందితులు వీరిని ఎటువైపు తీసుకెళ్లారనే విషయమై సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.