Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌ను తిడతావా.. పురుగులు పడి చస్తావ్: రేవంత్‌పై మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి. రూ.50 కోట్లు ఇచ్చి ఆయన పీసీసీ పదవిని కొని తెచ్చుకున్నారంటూ మంత్రి ఆరోపించారు. సీఎంను తిట్టిన రేవంత్ పురుగులు పడి చస్తాడంటూ మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

minister malla reddy sensational comments on tpcc chief revanth reddy
Author
Hyderabad, First Published Sep 19, 2021, 4:56 PM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి. రూ.50 కోట్లు ఇచ్చి ఆయన పీసీసీ పదవిని కొని తెచ్చుకున్నారంటూ మంత్రి ఆరోపించారు. సీఎంను తిట్టిన రేవంత్ పురుగులు పడి చస్తాడంటూ మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కాగా, డ్రగ్స్ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నిన్న తీవ్రంగా ప్రతిస్పందించారు.  డ్రగ్స్ వ్యవహారంలో ఓ పిచ్చోడు తనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాశాడని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు సీనియర్ నేతలు గాడిదలు అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడ్డగాడిదనా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి దూకుడు రియల్ ఎస్టేట్ వెంచర్ వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. మార్కెట్ చేసుకునేందుకు హడావిడి తప్ప అంత సీన్ లేదని అన్నారు. 

ALso Read:ఇది మల్లారెడ్డి అవినీతి చిట్టా... సర్వే నెంబర్లతో సహా బయటపెట్టిన రేవంత్ రెడ్డి

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, బిఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ జాతీయ పార్టీలకు తొత్తులని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ మీద తప్ప బిజెపి, కాంగ్రెసుల గురించి షర్మిల ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఓట్లు చీల్చి జాతీయ పార్టీలకు ప్రయోజనం చేకూర్చాలని ఆయన షర్మిలపై విరుచుకుపడ్డారు. బిజెపి, కాంగ్రెసు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దమ్ముంటే దళితబంధు ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios