గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ అనుమానితుడిగా ఎఫ్ఐఆర్ లో చేర్చబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Karnataka police: రేవ్ పార్టీకి 150 మంది మోడల్స్, సెలబ్రిటీలు హాజరయ్యారనీ, 40 మంది విదేశీ, భారతీయ మోడళ్లకు నోటీసులు జారీ చేసినట్లు కర్నాటక పోలీసులు తెలిపారు. వారంలోగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు విచారణలో అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీబీ మాజీ జాయింట్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు ఆయన తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాల ఆరోపణలపైనా దర్యాప్తు జరగనుంది.
గత ఏడాది అక్టోబర్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
మెగా డాటర్ నిహారిక కొణిదెల ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో జరిగిన లేట్ నైట్ పార్టీలో పాల్గొన్నారు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగించిన్నట్లు ఆధారాలు లభించిన నేపథ్యంలో ఆమెపై సోషల్ మీడియా ట్రోలింగ్స్ కి గురవుతున్నారు
''కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఇంత మార్పుంటే.. అసలు మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్లా యువర్ హానర్?'' అని సీనియర్ ఎన్టీఆర్ బొబ్బిలి పులి సింహం మూవీలో చెప్పినట్లు, కోర్టులు, వాటి తీర్పులు, చట్టాలు అన్ని చోట్లా, అందరికీ ఒకేలా అమలు కావు.
ఆదివారం వెలుగులోకి వచ్చిన బంజారాహిల్స్ పుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో రోజుకో నాటకీయ పరిణామం చోటు చేసుకుంటుంది. తాజాగా ఈ కేసులో దివంగత ఎన్టీఆర్ కూతురి అల్లుడు నిందితుడిగా ఉన్నట్లు తేలింది.
హైదరాబాద్లో డ్రగ్స్కు బానిసగా మారి బీటెక్ విద్యార్థి మృతిచెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ దర్యాప్తును వేగవంతం చేసింది. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న డ్రగ్స్ పెడ్లర్ లక్ష్మీపతి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ సేకరించిన కీలక సమాచారాన్ని కూడా హైకోర్టుకు అందించింది ఎక్సైజ్ శాఖ. ఈ సమాచారాన్నితెలంగాణ హైకోర్టు ఈడీకి అందించింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన డిజిటల్ రికార్డులను ఈడీకి సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరక హైకోర్టులో మెమో దాఖలు చేసింది.