శ్రావణి హత్య కేసు: మూడు చొక్కాలు మార్చిన శ్రీనివాస్ రెడ్డి
శ్రావణి హత్య జరిగిన రోజున శ్రీనివాస్ రెడ్డి మూడు చొక్కాలు మార్చాడని గ్రామస్తులు చెబుతున్నారు.
హాజీపూర్ గ్రామంలో వరుసగా విద్యార్థినుల హత్యలు కలకలం రేపుతున్నాయి.. ఈ హత్యలు చేసింది శ్రీనివాస్ రెడ్డి అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుల్లో విచారణ కోసం అతడిని పోలీసులు తమ అదుపులో ఉంచుకొన్నారు.
ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై గ్రామస్తులు తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. శ్రీనివాస్ రెడ్డి మూడు చొక్కాలు ఎందుకు మార్చారనే విషయం తమకు తెలియదంటున్నారు.
శ్రీనివాస్ రెడ్డికి సైకో లక్షణాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రోజున శ్రీనివాస్ రెడ్డి కొద్దిసేపు క్రికెట్ కూడ ఆడినట్టు విన్నామని కొందరు గ్రామస్తులు చెప్పారు. అయితే ఈ విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
చిన్నతనం నుండి శ్రీనివాస్ రెడ్డికి దొంగతనాలు చేసేవాడని గ్రామస్తులు చెబుతున్నారు.తల్లిదండ్రులు అదుపు చేయకపోవడం వల్ల శ్రీనివాస్ రెడ్డికి అడ్డు లేకుండా పోయిందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.
గ్రామంలో చిన్నతనం నుండే శ్రీనివాస్ రెడ్డి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడని గ్రామస్తులు గుర్తు చేసుకొంటున్నారు. చీరెలు, బంగారు ఆభరణాలను కూడ శ్రీనివాస్ రెడ్డి దొంగిలించేవాడని వారంతా చెబుతున్నారు.
సంబంధిత వార్తలు
శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: హాజీపూర్ గ్రామస్తుల డిమాండ్
రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్లో విద్యార్థినుల హత్యలు
శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే
షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం
శ్రావణి రేప్, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం
శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్లో అదృశ్యమైన కల్పన
శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు
శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు
శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత
శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)
శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు
శ్రావణి హత్య కేసు: బొమ్మల రామారం ఎస్ఐపై వేటు
తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం: హజీజ్ పురాలో ఉద్రిక్తత