Asianet News TeluguAsianet News Telugu

‘‘బావా..ఒక సారి ఇటు చూడు’’ షోయబ్ కి ఇండియన్స్ పిలుపు

 ఆ స్టేడియంలో మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇప్పుడు అదే నెట్టింట వైరల్ గా మారింది.

Watch: Indian Fans Call Shoaib Malik "Jiju", Pakistan All-Rounder Surprises Them
Author
Hyderabad, First Published Sep 24, 2018, 12:21 PM IST

భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఏ మ్యాచ్ కి లేని హైప్.. భారత్- పాక్ మ్యాచ్ కి ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. దుబాయిలో ఆదివారం భారత్- పాక్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీం ఇండియా క్రికెటర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు చితక్కొట్టారు.

ఇద్దరూ సెంచరీలు కొట్టి.. జట్టు గెలిపించేశారు. అయితే.. ఇండియా గెలిచిన విషయాన్ని కాస్త పక్కన పెడితే.. ఆ స్టేడియంలో మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇప్పుడు అదే నెట్టింట వైరల్ గా మారింది.

 

ఇంతకీ అంత ఇంట్రెస్ట్ గా ఏం జరిగింది అంటారా...పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ఇండియన్ క్రికెట్ అభిమానులు బావ అంటూ ఆప్యాయంగా పిలిచారు. షోయబ్.. భారత్ కి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సానియా చాలా ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు.

అయితే.. సానియాని పాకిస్థానీలు.. వదినా అని పిలుస్తారని గతంలో ఆమె తెలిపారు. ఈసారి ఇండియన్స్.. మ్యాచ్ రసవత్తరంగా జరుగుతున్న సమయంలో షోయబ్ ని ‘బావా.. ఒకసారి ఇటు చూడు’’ అంటూ  ఆప్యాయంగా పిలిచారు. వారి పిలుపు విన్న షోయబ్ కూడా అటు చూసి వారికి చేయి వూపారు. ఇప్పుడు ఈ వీడియో.. తెగ వైరల్ అవుతోంది. 

Watch: Indian Fans Call Shoaib Malik "Jiju", Pakistan All-Rounder Surprises Them
 

మరిన్ని వార్తలు చదవండి

భారత్, పాక్‌లలో ఎవరికి సపోర్ట్ చేస్తారన్న నెటిజన్.. ట్విట్టర్‌కు టాటా చెప్పిన సానియా

పాకిస్థానీలు.. నన్ను వదినా అని పిలుస్తారు.. సానియా

Follow Us:
Download App:
  • android
  • ios