గన్నవరంలో నిన్న టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణపై పోలీసులు పోస్టుమార్టం ప్రారంభించారు. పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే పరిస్థితి చేజారిందని ఎస్పీ ప్రకటించారు.
Andhra Pradesh Feb 21, 2023, 11:38 AM IST
గుంటూరు : టిడిపి కార్యాలయంపై దాడితో ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో అలజడి రేగింది.
Andhra Pradesh Feb 21, 2023, 9:54 AM IST
గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈమేరకు నిందితులను శిక్షించాలనంటూ డీజీపీకి లేఖ రాశారు.
Andhra Pradesh Feb 21, 2023, 2:24 AM IST
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడి జరిగిన విషయం తెలుసుకొని పార్టీ నేత పట్టాభిరామ్ గన్నవరం చేరుకున్నారు. కానీ, ఆయనను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Andhra Pradesh Feb 21, 2023, 1:46 AM IST
టీడీపీ నేతలు బచ్చుల అర్జునుడు, పట్టాభిలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు పరువు నష్టం దావా వేశారు. సంకల్పసిద్ది వ్యవహరంలో తప్పుడు ఆరోపణలు చేశారని వంశీ ఆరోపిస్తున్నారు.
Andhra Pradesh Dec 12, 2022, 8:48 PM IST
సంకల్పసిద్ది విషయంలో తనపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. సంకల్పసిద్దిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డీజీపీని కోరినట్టుగా చెప్పారు.
Andhra Pradesh Dec 1, 2022, 10:50 PM IST
టీడీపీ నేత పట్టాభిరామ్పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. రసగుల్లా అంటూ ఫైర్ అయ్యారు.
Andhra Pradesh Oct 29, 2022, 1:01 PM IST
TDP leader Pattabhiram: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం విజయవాడలోని పట్టాభిరామ్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.
Andhra Pradesh Jul 26, 2022, 1:57 PM IST
టీడీపీ నేతలు కొమ్మారెడ్డి పట్టాభిరాం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. వేర్వేరుగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ తో అనేక అంశాల మీద వారు జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
Andhra Pradesh Jul 23, 2022, 1:24 PM IST
కక్ష సాధింపు చర్యలో భాగమే అశోక్ బాబు అరెస్టు అని టీడీపీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరాం (kommareddy pattabhiram) అన్నారు. ప్రభుత్వం సంకట స్థితిలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్డడం సర్వ సాధారణం అయిపోయిందని ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రివర్స్ పీఆర్సీ తో మోసం చేసిన ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టడమే అశోక్ బాబు (ashok babu) చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా, సమైక్య ఆంధ్ర జేఏసీ చైర్మన్ గా అశోక్ బాబు ఉద్యోగుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. మూడేళ్లుగా టీడీపీ ఎమ్మెల్సీగా, శాసన మండలిలో వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారని తెలిపారు.
Andhra Pradesh Feb 11, 2022, 7:41 PM IST
విజయవాడ: జగనన్న గోరుముద్ద పథకంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందంటూ టిడిపి నాయకులు కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపణలు ఒక్కసారిగా ఏపీ రాజకీయాలకు వేడెక్కించాయి.
Andhra Pradesh Feb 2, 2022, 5:42 PM IST
Jagananna Gorumudda: ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మరోసారి ఆరోపణలు చేశారు. ఏపీని అప్పులపాలు చేసి జగన్ సర్కార్ దోచుకుంటోందనీ, ఓవైపు ఉద్యోగులు తమ జీతాల కోసం ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా తనకు ఇష్టం వచ్చినట్లు పంపకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Andhra Pradesh Jan 30, 2022, 3:56 PM IST
ఏపీ సీఎం జగన్ స్వార్థంతోనే గంగవరం పోర్టు అదానీకి అమ్మేశారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏపీ ప్రభుత్వానికి 10.4 శాతం వాటా 2.1 రెవెన్యూ షేర్ ఉన్న పోర్టును కేవలం రూ. 645 కోట్లకు అమ్మడం ఏంటని అన్నారు. నిరంతరం ఆదాయం వచ్చే పోర్టును కమీషన్ల కోసం అమ్మడం ఏంటని ప్రశ్నించారు. 100 కోట్ల పైన ఉన్న టెండర్లు ఓపెన్ బిడ్ ద్వారా వేయాలని నిబంధనలు చెబుతున్నాయని అన్నారు. కానీ గంగవరం పోర్టు విషయంలో ఆ నిబంధనను తుంగలో తొక్కారని తెలిపారు.
Andhra Pradesh Dec 27, 2021, 5:58 PM IST
‘బొసిడికే’ ఈ బూతు పదం పలకడానికే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ఈ పదం ఈ ఏడాది ఏపీ రాజకీయాల్లో మార్మోగింది. గ్రామాల్లో చదువురాని వారు, బయటి ప్రపంచంలో పెద్దగా తిరగని వారు ఇలాంటి పదాలు వాడుతుంటారు. కానీ ఏపీ రాజకీయాల్లో ముఖ్య స్థానాల్లో ఉన్న నాయకులు ఈ పదాన్ని వాడటం పట్ల సమాజంలో బాగా చర్చ జరిగింది. ఈ ఏడాది అక్టోబర్లో వెలుగులోకి వచ్చిన ఈ పదం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
Andhra Pradesh Dec 16, 2021, 7:41 PM IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కూడా సీబీఐ విచారించాలని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి డిమాండ్ చేశారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం, ఆయన కూతురు సునీత హైకోర్టులో వేసిన పిటిషన్లోని వివరాలను పేర్కొంటూ ఆయన ఈ డిమాండ్ చేశారు. వివేకా హత్య వెనుక ఉండి నడిపించిన శంకర్ రెడ్డి.. సీఎం జగన్కు ఆప్తుడైన ఎంపీ అవినాశ్ రెడ్డికి సన్నిహితుడు అని ఆరోపించారు.
Andhra Pradesh Nov 16, 2021, 5:35 PM IST