Asianet News TeluguAsianet News Telugu

నా భర్తకు ప్రాణహాని... ఏం జరిగినా డిజిపి, సీఎం జగన్ లదే బాధ్యత: పట్టాభి భార్య ఆందోళన

గుంటూరు : టిడిపి కార్యాలయంపై దాడితో ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో అలజడి రేగింది. 

గుంటూరు : టిడిపి కార్యాలయంపై దాడితో ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో అలజడి రేగింది. అయితే ఈ దాడి గురించి తెలిసి గన్నవరం వెళుతున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన భర్త కనిపించకుండా పోయారని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం భార్య చందన ఆందోళన వ్యక్తం చేసారు. దాడిజరిగిన టిడిపి కార్యాలయం వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డ్రైవర్, పీఏ చెబుతున్నారని... కానీ ఎక్కడికి తీసుకెళ్ళారో తెలియడం లేదన్నారు. డ్రైవర్, పీఏను పోలీస్ స్టేషన్లో వుంచి తన భర్తను మాత్రం ఎక్కడికో తీసుకెళ్లారని... ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తుందని ఆందోళన చెందారు. పట్టాభిరాంకు ఏం జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, డిజిపి లదే బాధ్యత అని చందన పేర్కొన్నారు.