విదేశాల్లో మొట్టమొదటి సారిగా లండన్ టవర్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ను జెండాను ఆవిష్కరించారు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్. త్వరలో బీఆర్ఎస్ నాయకులను ఆహ్వానించి పార్టీ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు.
అమెరికాలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ఓ టెకీ అమెరికాలో మృతి చెందాడు. సెలవుల్లో సరదాగా గడుపుదామని ట్రెక్కింగ్ కు వెళ్లి.. ప్రమాదవశాత్తు 200 అడుగుల లోయలో పడి మృత్యువాత పడ్డాడు.
పీహెచ్ డీ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్లిన విద్యార్థిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పదకొండుసార్లు పొడవడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికాలోని ఇతాకా జలపాతంలో పడి కెనడాకు చెందిన ఓ తెలుగు ఇంజనీర్ మృతి చెందాడు.
అమెరికాలో భారత సంతతి విద్యార్థి హత్య కేసులో నిందితుడు షాకింగ్ విషయాలు వెల్లడించాడు. కత్తితో పొడిచి చంపానని ఒప్పుకున్నాడు.
కొడుకు నుంచి విడాకులు అడిగిందని కోడలిని అతి దారుణంగా హత్య చేశాడో మామ. 74 యేళ్ల ఆ ఎన్నారై వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
భారతీయ సంతతికి చెందిన వరుణ్ మనీష్ ఛేడా అనే యువకుడు పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతను అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని తన డార్మిటరీలో శవమై కనిపించాడు.
కాలిఫోర్నియాలో కిడ్నాప్ కు గురైన సిక్కు కుటుంబం విగతజీవులుగా కనిపించారు. భార్య, భర్త, ఓ చిన్నారి, వారి బంధువు నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.