London: 9 ఏండ్ల కు దశాబ్ది ఉత్సవాల పేరిట, తెలంగాణప్రభుత్వ ధనంతో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం చేసుకోవడం శోచనీయమనీ, గత 9 ఏండ్ల లో విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ కల్పన.. ఇలా అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని టీపీసీసీ ఎన్నారై సెల్ ఆరోపించింది. కాంగ్రెస్ నాటిన విత్తనాల ఫలితాలే కాల క్రమేణా పెరిగిన అభివృద్ధి పై కేసీఆర్ తన పేరు చెప్పుకొని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించింది.