ఉన్నావ్ రేప్ విక్టిమ్ కోర్టుకు వెళ్తుండగా .. ఒంటికి నిప్పు అంటించి..
వీరిలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేశామని , మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని ఉన్నావ్ సీనియర్ పోలీస్ అధికారి విక్రాంత్ విర్ తెలిపారు.
దిశ ఘటన మరవక ముందే... మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ అత్యాచార బాధితురాలు కోర్టుకు వెళుతుండగా... ఆమెపై దాడి చేశారు. ఒంటికి నిప్పు అంటించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో సదరు యువతి దాదాపు 60శాతం కాలిపోవడం గమానార్హం.
తదుపరి చికిత్స కోసం లక్నో ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.ఈ ఏడాది మార్చిలో తన గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని 23 సంవత్సరాల బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఇక మహిళకు నిప్పంటించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరిలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేశామని , మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని ఉన్నావ్ సీనియర్ పోలీస్ అధికారి విక్రాంత్ విర్ తెలిపారు.
ఉన్నావ్లో తనపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి ఆ దృశ్యాన్ని వీడియో తీశారని ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకరిని యూపీ పోలీసులు అరెస్ట్ చేయగా అతను బెయిల్పై విడుదలయ్యాడు. మరో నిందితుడిని ఇప్పటివరకూ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. నిందితుడి ఆస్తులను అటాచ్ చేసి ఆయనపై లుక్అవుట్ నోటీస్ జారీ చేశామని పోలీసులు చెబుతున్నారు.