చిదంబరానికి ఊరట:ఎయిర్సెల్ కేసులో బెయిల్ మంజూరు
మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి కోర్టులో ఊరట లభించింది. ఎయిర్ సెల్ కేసులో కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ఆయన తనయుడు కార్తీ చిదంబరానికి సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఐఎఎక్స్ మీడియా కేసులో చిదంబరం అరెస్టయ్యాడు.
ఎయిర్సెల్ కేసులో చిదంబరానికి బెయిల్ మంజూరు చేయకూడదని సీబీఐ, ఈడీలు కోర్టులో తమ వాదనను విన్పించాయి. అయితే ఈ కేసులో సీబీఐ, ఈడీ వాదనలను కోర్టు తోసిపుచ్చుతూ చిదంబరానికి బెయిల్ మంజూరు చేసింది. మరో వైపు ఐఎఎక్స్ మీడియా కేసులో బెయిల్ కోసం చిదంబరంకు చుక్కెదురైంది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన సుప్రీం.. బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. బెయిల్ ఇవ్వడం కుదరదని ఆర్థిక నేరాలను భిన్న కోణంలో చూడాలని ధర్మాసనం తెలిపింది. చిదంబరం ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. మరోవైపు ఈడీ కూడా ఆయనను విచారించేందుకు సిద్ధమవుతోంది.
సంబంధిత వార్తలు
ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరానికి షాక్, బెయిల్కు సుప్రీం నో
ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు
చిదంబరానికి స్వల్ప ఊరట: తీహార్కొద్దు కస్టడీకి తీసుకోమన్న సుప్రీం
చిదంబరం అరెస్ట్... చాలా సంతోషంగా ఉందన్న ఇంద్రాణి ముఖర్జీ
చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు: అరెస్ట్ పై జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం
చిదంబరానికి బెయిల్..? నేడు కోర్టులో విచారణ
ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం కేసు విచారిస్తున్న అధికారి బదిలీ
నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం
చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్క్వార్టర్స్లోనే
రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్పై కార్తీ
కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు
చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు
కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు
అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు
చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్పై శుక్రవారం విచారణ
ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....