రాఫెల్ డీల్ లో ఆమెను బలిపశును చేశారు: కాంగ్రెస్
దేశంలోనే అతిపెద్ద కుంభకోణం రాఫెల్ డీల్ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాఫెల్ డీల్ అవినీతికి జేజమ్మ వంటిదని అభివర్ణించింది. నరేంద్ర మోదీ డీఎన్ఏలో క్రోనీ క్యాపిటలిజం ముఖ్యమైన భాగంగా మారందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి శక్తి సింగ్ గోహిల్ ఆరోపించారు.
రాజస్థాన్ : దేశంలోనే అతిపెద్ద కుంభకోణం రాఫెల్ డీల్ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాఫెల్ డీల్ అవినీతికి జేజమ్మ వంటిదని అభివర్ణించింది. నరేంద్ర మోదీ డీఎన్ఏలో క్రోనీ క్యాపిటలిజం ముఖ్యమైన భాగంగా మారందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి శక్తి సింగ్ గోహిల్ ఆరోపించారు. మోదీ హయాంలో రాఫెల్ విమానం ధర రూ.526 కోట్ల నుంచి రూ.1670 కోట్లకు మూడు రెట్లు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. మోదీ కోట్లలోనే ముడుపులు స్వీకరిస్తారని ఆరోపించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో ముగ్గురు రక్షణ శాఖ మంత్రులను మార్చిందని ఆరోపించారు. అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్ లాంటి నేతలు రాఫెల్ డీల్లో అవినీతి మరకలను తప్పించుకుని నిర్మలా సీతారామన్ను బలిపశువును చేశారన్నారు. మరోవైపు బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్ గాంధీకి ఎలాంటి సంబంధం లేకపోయినా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్ గాంధీ పాత్ర అంటూ ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా బీజేపీ బురుదచల్లుతోందని ఆరోపించారు.
రక్షణ ఒప్పందాల్లో అవినీతి ఆరోపణలకు చోటులేకుండా వాటిపై చర్చించేందుకు కమిటీలను నియమించాలని గోహిల్ కోరారు. రాఫెల్ ఒప్పందంలో అక్రమాలు చోటుచేసుకోలేదని మోదీ సర్కార్ భావిస్తే.. సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించేందుకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు.