Asianet News TeluguAsianet News Telugu

కన్నకూతురిపై అత్యాచారం, బిడ్డకు జన్మనిచ్చిన బాలిక.. శిశువును కాలువలోకి విసిరేస్తూ పట్టుబడ్డ తండ్రి...

డ్రగ్స్ కు బానిసైన ఓ తండ్రి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చి, ప్రసవించింది. ఆ శిశువును కాలువలోకి విసిరేస్తూ తండ్రి పట్టుబడ్డాడు.

Molested by father, minor delivers child in punjab
Author
First Published Sep 1, 2022, 7:59 AM IST

పంజాబ్ : కష్టం వస్తే కాపాడాల్సిన కన్నతండ్రే కామాంధుడిగా మారాడు. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన పంజాబ్ లో వెలుగు చూసింది. జలంధర్ లెదర్ కాంప్లెక్స్ ప్రాంతానికి చెందిన 14 సంవత్సరాల బాలికపై ఆమె తండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారి గర్భం దాల్చి.. బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను ప్రసవించగానే.. నిందితుడు శిశువును కాలువలోకి విసిరేయడానికి తీసుకువెళ్లారు...విసిరేస్తుండగా చూసిన గ్రామస్థులు అడ్డుకున్నారు. అతని వద్ద నుంచి శిశువును తీసుకున్నారు. 

ఆ శిశువు ఎవరిదో ఆరా తీయగా, ఆ కిరాతకుడికి అక్రమంగా పుట్టిందేనని తేలింది. కొంత కాలంగా తండ్రి తనపై అత్యాచారం చేసినట్లు బాలిక తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే మా అమ్మను, నన్ను ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడని అందుకే ఎవరికీ చెప్పలేదు అని వాపోయింది. దీని మీద భార్య మాట్లాడతూ.. ‘గత కొన్ని రోజులుగా నా భర్త మాదక ద్రవ్యాలకు బానిస అయ్యాడు. నా కుమార్తె జీవితాన్నినాశనం చేశాడు. అతనిని కఠినంగా శిక్షించండి’ అని కోరింది. గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించి.. బాలికను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న  పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడు అరెస్ట్

ఇదిలా ఉండగా, ఐస్ క్రీంలో మత్తుమందు కలిపి ఇచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో సోమవారం వెలుగుచూసింది. ఆర్మూర్ మండలంకు చెందిన టిఆర్ఎస్ నేత చంద్రశేఖర్ గ్రామ వార్డుసభ్యుడిగా కొనసాగుతున్నాడు. అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళతో అతనికి వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఆమె తొమ్మిదేళ్ల కుమార్తెపై చంద్రశేఖర్ కన్నుపడింది. ఆదివారం బాలిక తల్లి కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు వెళ్లగా.. ఎవరూ లేని సమయం చూసి చంద్రశేఖర్ ఆమె ఇంటికి వెళ్లాడు. 

బాలికకు ఐస్ క్రీమ్ లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆర్మూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. దీంతో తన బైక్ పైనే నిజామాబాద్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. ఆస్పత్రి సిబ్బందికి బాలిక తల్లి ఫోన్ నెంబర్ ఇచ్చి పరారయ్యాడు. ఆస్పత్రి సిబ్బంది ఘటనపై ఆరా తీయగా విషయం వెలుగుచూసింది. జరిగిన దారుణంపై బాలిక తల్లి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చంద్రశేఖర్ పై పోక్సో కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios