కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత
గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధతపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు కన్నుమూశారు. వయానాడ్ ఎంపీ, కేరళ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఐ షానవాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధతపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా..బుధవారం ఉదయం ఆయన కన్నుమూశారు.
న్యాయవాదుల కుటుంబంలో జన్మించిన ఆయన విద్యార్థి నాయకునిగా జీవితం ప్రారంభించారు. తొలుత కేరళ విద్యార్థి సంఘంలో పనిచేసిన ఆయన యూత్ కాంగ్రెస్ లో చేరి ఉపాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో కీలక పదవులు చేపట్టి,... కీలక పాత్ర పోషించారు.
ఆయన మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.