భార్యతో గొడవపడి.. 9 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం.. మధ్యప్రదేశ్ లో ఘటన
కన్న కూతురుపైనే ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. భార్య ఇంట్లోలేని సమయం చూసి తాగిన మత్తులో కూతురును రేప్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి తండ్రి అనే పేరుకే మచ్చ తీసుకొచ్చాడు. తొమ్మిదేళ్ల కూతురు అని కూడా చూడకుండా కామంతో రెచ్చిపోయాడు. ఆ బాలికను అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పెంపుడు కుక్కతో చిన్నారి దాగుడుమూతలాట.. ఎంతచక్కగా వింటుందో చూడండి...
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వృత్తిరీత్యా వడ్రంగి. మంగళవారం అతడి భార్యతో గొడవ జరిగింది. ఈ క్రమంలో అతడు భార్యపై ఉమ్మివేశాడు. దీంతో ఆమె కోపంతో తన 9 ఏళ్ల కూతురును అక్కడే విడిచిపెట్టి తన పుట్టింటికి వెళ్లిపోయింది.
తరువాత ఇంట్లోనే ఉన్న నిందితుడు తాగిన మత్తులో కూతురును రేప్ చేశాడు. తెల్లారి అతడి భార్య పుట్టింటి నుంచి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో బాలిక ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగిందని ఆరా తీస్తే ఆ బాలిక తనపై జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పింది. ఈ విషయంలో భర్తను ఆమె నిలిదీసింది. దీంతో అతడు భార్యను బెదిరించాడు. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూతురును కూడా హెచ్చరించాడు.
భారత స్వాతంత్య్ర పోరాటం.. జమ్మూకాశ్మీర్ లో హిందూ-ముస్లింల ఐక్యత వెల్లువిరిసిన వేళ.. !
అనంతరం ఆమె పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై పోస్కోలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
ఇలాంటి ఘటనే ఈ ఏడాది మార్చిలో బీహార్ లో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కూతుళ్లపై కన్ తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 14, 16 ఏళ్ల వయస్సున్న ఇద్దరు బాలికలు బక్సర్ జిల్లా రాజ్పుర్ తాలుకాలో ఉంటున్నారు. వీరి తండ్రి ఓ వైద్యుడు. విటమిన్ ట్యాబ్లెట్ల పేరిట ఆ బాలికలకు నిద్రమాత్రలు ఇచ్చేవాడు. అనంతరం తన క్లీనిక్లోనే అత్యాచారం చేసేవాడు. తండ్రిని ఎదురిస్తే తీవ్రంగా కొట్టేవాడని బాలికలు తెలిపారు. దీంతో అతడి హింసను తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయారు. బక్సర్లో చిన్న అద్దె ఇంట్లో తలదాచుకున్నారు.
భారత 14వ ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన జగదీప్ ధన్కర్
తమపై జరిగిన అత్యాచారాన్ని వివరిస్తూ ఆ బాలికలు ఇద్దరు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. తమపై జరిగిన లైంగిక దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఇదే తరుణంలో మహిళా పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు పోలీసులు. బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే కొడుకు పుట్టాలన్న ఆశతోనే తండ్రి ఓ తాంత్రికుడితో కలిసి బరితెగించాడని పోలీసులు వెల్లడించారు.