Asianet News TeluguAsianet News Telugu

సింగరేణి కాలనీ తరహాలో మరో ఘ‌టన.. ట్రంకుపెట్టెలో ఆరేళ్ల చిన్నారి..

దేశంలో బాలిక‌లు, మ‌హిళ‌లకు ర‌క్ష‌ణ లేకుండా పోతున్న‌ది. వారిపై దాడులు, అఘాయిత్యాలు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇటీవ‌ల హైద‌రాబాద్ న‌గ‌రంలోని సైద‌బాద్ డివిజ‌న్‌లోని సింగ‌రేణి కాల‌నీలో ఆరేండ్ల చిన్నారిని అత్యాచారం చేసి, ప్రాణాలు తీసిన ఘ‌ట‌న త‌ర‌హాలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనూ మరో ఘటన  చోటుచేసుకుంది. 
 

child rape and murder in Uttar Pradesh
Author
Hyderabad, First Published Dec 5, 2021, 11:47 AM IST

దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా..  చిన్నారులు, బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌లపై  మానవ మృగాలు దాడుల‌కు, అఘాయిత్యాలకు పాల్ప‌డుతున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒక‌చోటు మ‌హిళ‌ల‌పై దాడులు, హింస చోటుచేసుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన హైద‌రాబాద్‌లోని సైదాబాద్ డివిజ‌న్‌లోని సింగ‌రేణి కాల‌నీలో మ‌త్తుకు బానిసైన రాజు అనే దుర్మార్గుడు ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్ప‌డటంతో పాటు బాలిక ప్రాణాలు సైతం తీశాడు. ఇదే త‌ర‌హా ఘ‌ట‌న ఉత్త‌ర భార‌తంలోని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడు ఇది సంచ‌ల‌నంగా మారింది. 

Also Read: క‌రోనా పంజా.. ఒక్క‌రోజే 2,796 మంది మృతి

Also Read: ఆర్థిక చాణక్యుడు.. అత్య‌ధిక‌సార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన రోశ‌య్య‌

 

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. యూపీలోని హపూర్‌ ప్రాంతానికి చెందిన ఆరేండ్ల బాలిక‌ రెండు రోజుల క్రితం (గురువారం) క‌నిపించ‌కుండా పోయింది. చాక్లెట్‌ కొనుక్కుంటానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలిక మ‌ళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన బాలిక  కుటుంబ స‌భ్యులు  వేత‌క‌టం ప్రారంభించారు. రాత్రంతా బాలిక కోసం వెతికినా.. బాలిక ఆచూకీ ల‌భించ‌లేదు.  దీంతో శుక్ర‌వారం ఉద‌యం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాలిక క‌నిపించ‌కుండా పోయిన వివ‌రాలు పోలీసుల‌కు అందించారు. ఇదిలావుండ‌గా,  స్థానికంగా ఉన్న ఒక ఇంట్లో నుంచి త‌ట్టుకోలేని దుర్వాస‌న రావ‌డాన్ని గ‌మ‌నించిన స్థానికులు.. ఈ విష‌యాన్ని పోలీసులు తెలిపారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు  అక్క‌డి చేరుకుని ఇంటి తాళలను పగులగొట్టారు. దుర్వాసన వ‌స్తున్న ట్రంక్కుపెట్టెను ఒపెన్ చేసి చూడ‌గా, షాకింగ్ విష‌యాలు వెలుగుచూశాయి. 

Also Read: కాంగ్రెస్ నుంచి మరో కొత్త పార్టీ రానుందా?.. సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు

దుర్వాస‌న వ‌స్తున్న  ఆ ట్రంక్‌ పెట్టెలో బట్టలు, ఓ బాలిక మృతదేహాం క‌నిపించింది. దీనిని త‌ప్పిపోయిన బాలిక మృత‌దేహంగా పోలీసులు గుర్తించారు.  ఇంటి యజమానిపై కేసు నమోదుచేసి అతన్ని అదుపులోకి తీసుకోవడానికి రంగం లోకి దిగారు. అయితే,  ఈ  విష‌యం తెలుసుకున్న స్థానికులు ఇంటి య‌జ‌మానికి పోలీసులు అదుపులోకి తీసుకునే ముందే చిత‌క‌బాదారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్క‌డి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించ‌గా, ఆ బాలికను ఇంటి యజమాని బైక్‌ మీద కూర్చోబెట్టుకుని, అతని ఇంటికి తీసుకెళ్లిన దృశ్యాలు క‌నిపించాయి.  నిందితుడు ఆ బాలికపై అత్యాచారం చేసి , హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వైద్య ప‌రీక్ష‌ల రిపోర్టులు వచ్చాక.. పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.  ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లోనూ ద‌ర్వాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు.  ఇక ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌పై స్థానికంగా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. 

Also Read: ఆర్థిక మంత్రిగా సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిన కొణిజేటి రోశ‌య్య.. రాజకీయ ప్రస్థానం..

Also Read: పెగాసస్.. ఎన్ఎస్ వో నిషేధంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు


 

Follow Us:
Download App:
  • android
  • ios