Asianet News TeluguAsianet News Telugu

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: లోయలో పడిన ట్రక్కు, 10 మంది దుర్మరణం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇటావా జిల్లాలో ఓ ట్రక్కు లోయలో పడిపోవటంతో 10 మంది దుర్మరణం పాలవ్వగా... 30 నుంచి 35 మంది వరకు గాయపడ్డారని అంచనా

at least 10 killed in truck falls into gorge in uttar pradesh ksp
Author
Uttar Pradesh, First Published Apr 10, 2021, 7:52 PM IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇటావా జిల్లాలో ఓ ట్రక్కు లోయలో పడిపోవటంతో 10 మంది దుర్మరణం పాలవ్వగా... 30 నుంచి 35 మంది వరకు గాయపడ్డారని అంచనా.

సమాచారం అందుకున్న పోలీసులు..ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బర్హపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రవెనే ప్రాంతంలో డ్రైవర్‌ ఆ ట్రక్కుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

ప్రమాద సమయంలో ట్రక్కులో 40 నుంచి 50 మంది ఉన్నట్టు సమాచారం. మరణించిన వారంతా పురుషులేనని అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios