యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: లోయలో పడిన ట్రక్కు, 10 మంది దుర్మరణం
ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇటావా జిల్లాలో ఓ ట్రక్కు లోయలో పడిపోవటంతో 10 మంది దుర్మరణం పాలవ్వగా... 30 నుంచి 35 మంది వరకు గాయపడ్డారని అంచనా
ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇటావా జిల్లాలో ఓ ట్రక్కు లోయలో పడిపోవటంతో 10 మంది దుర్మరణం పాలవ్వగా... 30 నుంచి 35 మంది వరకు గాయపడ్డారని అంచనా.
సమాచారం అందుకున్న పోలీసులు..ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బర్హపుర పోలీస్స్టేషన్ పరిధిలోని రవెనే ప్రాంతంలో డ్రైవర్ ఆ ట్రక్కుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ప్రమాద సమయంలో ట్రక్కులో 40 నుంచి 50 మంది ఉన్నట్టు సమాచారం. మరణించిన వారంతా పురుషులేనని అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.