కామంతో కళ్లు మూసుకుపోయి.. ఆవుపై అత్యాచారం: సీసీ ఫుటేజ్ ద్వారా పట్టుకున్న పోలీసులు
మధ్యప్రదేశ్లో సంచలనం కలిగించిన ఆవుపై అత్యాచారం చేసిన నిందితుడిని భోపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సెక్షన్ 377 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మధ్యప్రదేశ్లో సంచలనం కలిగించిన ఆవుపై అత్యాచారం చేసిన నిందితుడిని భోపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సెక్షన్ 377 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4న మధ్యప్రదేశ్ సుందర్నగర్ ప్రాంతంలోని పశువుల పాడిలోకి షబ్బీర్ అలీ అనే 55 ఏళ్ల వ్యక్తి చొరబడ్డాడు. అనంతరం అక్కడి ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు లేని విధంగా ఆవు విపరీతంగా రోదిస్తుండటంతో ఇంటి యజమాని అక్కడికి వెళ్లి చూడగా, నిందితుడు పరారయ్యాడు.
అనుమానం వచ్చిన ఆయన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. షబ్బీర్ ఆవుపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనపై అశోక్ గార్డెన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.