Haryana riots: హర్యానాలోని నుహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు అల్లరిమూకలు ప్రయత్నించి రాళ్లు రువ్వడం, కార్లకు నిప్పు పెట్టడంతో ఐదుగురు మృతి చెందగా, పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. వాహనానికి నిప్పుపెట్టడంతో ఇద్దరు హోంగార్డులు మృతి చెందారు. నూహ్, గురుగ్రామ్ లలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి 144 సెక్షన్ విధించారు.