రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో నోరు జారడం సాధారమైన విషయం. అయితే జాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కూడా కీలక ప్రసంగం చేసేటప్పుడు తడబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో నోరు జారడం సాధారమైన విషయం. ఇది కొన్ని సందర్బాల్లో తీవ్ర విమర్శలకు దారితీస్తుంటాయి. అందుకే కీలకమైన ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రసంగాల్లో కొన్నిసారగ్లు పొరపాట్లు దొర్లుంటాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా కీలక ప్రసంగం చేసేటప్పుడు తడబడ్డాడు. స్టేట్ ఆఫ్ యూనియన్లో ప్రసంగించిన బైడెన్.. ఉక్రెయిన్పై రష్యా దాడిని తీవ్రంగా ఖండించారు.
ప్రసంగం చేస్తున్న సమయంలో ఓ చోట.. ఉక్రెనియిన్లు అనాల్సిన చోట ఇరానియన్ ప్రజలు అని బైడెన్ అన్నారు. రష్యా దళాలు కీవ్ నగరాన్ని చుట్టుముట్టవచ్చు.. కానీ ఉక్రెయిన్ ప్రజల మనసులను పుతిన్ ఏనాటికి కూడా గెలుచుకోలేడని చెప్పే సందర్భంలో బైడెన్ నోరు జరారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. గతంలో కూడా బైడెన్ బహిరంగంగా మాట్లాడినప్పుడు పొరపాట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది కూడా ఉపాధ్యక్షురాలు హారిస్ను పొరపాటున ప్రెసిడెంట్ హారిస్ అంటూ సంబోధించారు.
ఇక, జో బైడెన్ (Joe Biden).. ఉక్రెయిన్కు తన మద్దుతను బలపరిచారు. రష్యా భీకర దాడులు చేస్తున్న ఉక్రెయిన్ ప్రజలు మనో ధైర్యంతో పోరాడుతున్నారని ప్రశంసించారు. అయితే రష్యాపై ఉక్రెయిన్ పోరాటంలో అమెరికా సేనల ప్రమేయం ఉండదని.. అయితే నాటో సభ్యదేశాల భూభాగాల జోలికి వస్తే మిత్రదేశాలతో కలిసి వాటిని కాపాడుకుంటామని చెప్పారు. పుతిన్ యుద్దభూమిలో లాభాలు సాధించవచ్చని.. కానీ దీర్ఘకాలంలో తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
‘యుఎస్, మా మిత్రదేశాలు.. పూర్తి సామూహిక శక్తితో నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటాయి. ఉక్రెయిన్ ప్రజులు చాలా ధైర్యంగా పోరాడుతున్నారు. పుతిన్ యుద్దభూమిలో ప్రస్తుతానికి విజయం సాధించవచ్చేమో.. కానీ దీర్ఘకాలంలో అతను మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా దళాలు ఉక్రెయిన్ కోసం పోరాడటం లేదు. కానీ మా నాటో మిత్రదేశాలను రక్షించడానికి.. పుతిన్ పశ్చిమ దేశాలకు వెళ్లకుండా నిరోధించడానికి సిద్దంగా ఉంటాయి. పోలాండ్, రొమేనియా, లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియాతో సహా నాటో దేశాలను రక్షించడానికి మేము అమెరికన్ గ్రౌండ్ ఫోర్స్లు, ఎయిర్ స్క్వాడ్రన్లు, నౌకలను సమీకరించాం’ అని బైడెన్ తెలిపారు.
అమెరికా ప్రజలు, తాము ఉక్రెయిన్ ప్రజలతో ఉంటామని బైడెన్ అన్నారు. ‘నియంతలు వారి దూకుడుకు మూల్యం చెల్లించనప్పుడు.. వారు యుద్దం, గందరగోళానికి కారణమవుతారు. అప్పుడు అమెరికాతో పాటు ప్రపంచానికి ముప్పు పెరుగుతుంది. అందుకే రెండో ప్రపంచ యుద్దం తర్వాత యూరప్లో శాంతి, స్థిరత్వం కోసం నాటో కూటమి సృష్టించబడింది. ఇందులో అమెరికా సభ్య దేశం. అమెరికా దౌత్యం చాల ముఖ్యం’ అని బైడెన్ అన్నారు.
