దుమ్మురేపుతున్న సుడిగాలి సుధీర్ `గాలోడు` కలెక్షన్లు.. ఓటీటీ రైట్స్ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!
`జబర్దస్త్` కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన `గాలోడు` చిత్రం థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ చిత్రం ఇండస్ట్రీ వర్గాలకు షాకిస్తుంది. మరోవైపు ఓటీటీ రైట్స్ విషయంలో ఆశ్చర్యపరుస్తుంది.
సుడిగాలి సుధీర్ హీరోగా సత్తా చాటుతున్నారు. `జబర్దస్త్`లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న ఆయన ఇటీవల షోస్కి గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. సినిమాలపై ఫోకస్ పెట్టాడు. నెమ్మదిగా హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. లేటెస్ట్ గా సుధీర్ `గాలోడు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టుకున్నా నెమ్మదిగా పుంజుకుంటోంది.
`గాలోడు` థియేటర్లలో సత్తా చాటుతుంది. ఈ శుక్రవారం విడుదలైన సినిమాల్లో `గాలోడు`నే పెద్ద సినిమా కావడం, పైగా సుధీర్కి టీవీ ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో అదంతా కలెక్షన్ల విషయంలో హెల్ప్ అవుతుంది. దీనికితోడు సినిమాలో కావాల్సిన యాక్షన్ ఎలిమెంట్లు, సుధీర్ ఎలివేషన్లు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. దీంతో సెటిల్డ్ గా రన్ అవుతుంది.
తాజాగా ఐదు రోజుల్లో ఈ సినిమా ఏకంగా సుమారు ఐదు నుంచి ఆరు కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్టు సమాచారం. దాదాపుగా నాలుగు కోట్ల షేర్ని రాబట్టిందని తెలుస్తుంది. చిత్ర దర్శకుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సినిమా కలెక్షన్లు బాగున్నాయని, ప్రస్తుతం లాభాల్లోనే ఉన్నామని చెప్పారు దర్శకుడు రాజశేఖర్రెడ్డి. ముందుగానే ఈ విజయాన్ని ఊహించినట్టు చెప్పారు.
ఇదిలా ఉంటే ఈ చిత్రం ఓటీటీ రైట్స్ కూడా భారీగానే పలికాయట. దాదాపు నాలుగు కోట్లకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ డిజిటల్ రైట్స్ ని తీసుకునేందుకు డీల్ కుదుర్చుకుంటుందని, ప్రస్తుతం దానికి సంబంధించిన టాక్స్ జరుగుతున్నాయని త్వరలోనే క్లారిటీ వస్తుందని తెలిపారు దర్శకుడు. ఈ సినిమాకి దాదాపు ఏడు కోట్లు బడ్జెట్ అయ్యిందట. కరోనా కారణంగా, క్వాలిటీ కోసం అనుకున్న బడ్జెట్కి డబుల్ అయ్యిందని, కానీ పెట్టిన ఖర్చుకి డబుల్, త్రిబుల్ వస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
దర్శకుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మొదట సుధీర్ ఇమేజ్ నాకు అంతగా తెలియదు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సమయంలో ఆయన క్రేజ్ తెలిసింది. అప్పుడు విజయం పై మరింత నమ్మకం పెరిగింది. `సాఫ్ట్ వేర్ సుధీర్`, `గాలోడు` సినిమా కథలను రష్మీకి చెప్పాం. కానీ డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదు. రష్మీ సుధీర్ ఇద్దరితో నేను ఓ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. త్వరలో కచ్చితంగా చేస్తాను. ఆ ఇద్దరితో `గజ్జల గుర్రం` అనే సినిమాను చేయాలని అనుకుంటున్నా` అని తెలిపారు. సుడిగాలి సుధీర్ జోడీగా గెహ్నా సిప్పీ హీరోయిన్గా నటించిన `గాలోడు` చిత్రానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.