- Home
- Entertainment
- Rajasekhar: టాలీవుడ్ ని షేక్ చేసిన మూవీ, ఓవర్ యాక్షన్ అంటూ స్టార్ హీరో పరువు తీసిన కూతుళ్లు
Rajasekhar: టాలీవుడ్ ని షేక్ చేసిన మూవీ, ఓవర్ యాక్షన్ అంటూ స్టార్ హీరో పరువు తీసిన కూతుళ్లు
రాజశేఖర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ అయిన అంకుశం చిత్రం ఆయన కూతుళ్ళకు ఏమాత్రం నచ్చలేదట. వాళ్లకు ఎందుకు నచ్చలేదో రాజశేఖర్ కారణం చెప్పారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

Rajasekhar
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో అంకుశం ఒకటి. ఒకప్పుడు రాజశేఖ తన సినిమాలతో చిరంజీవి, వెంకీ, నాగ్, బాలయ్య లాంటి అగ్ర హీరోలకు పోటీ ఇచ్చేవారు. అంకుశం, మగాడు, అల్లరి ప్రియుడు, మా అన్నయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రాజశేఖర్ కెరీర్ లో ఉన్నాయి.
అంకుశం మూవీ
అంకుశం మూవీ కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. జీవిత రాజశేఖర్ హీరోయిన్ గా నటించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. పవర్ ఫుల్ పోలీస్ అధికారికగా రాజశేఖర్ నటన నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులు రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు. అందుకే అంకుశం మూవీ టాలీవుడ్ ని షేక్ చేసేలా సంచలన విజయం అందుకుంది.
పరువు తీసిన కూతుళ్లు
అయితే ఈ మూవీ విషయంలో రాజశేఖర్ కి తన కుటుంబ సభ్యుల నుంచి వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ఈ మూవీ టీవీలో వస్తున్నప్పుడు ఆయన కూతుళ్లు శివాని, శివాత్మిక చూశారట. రాజశేఖర్ మాట్లాడుతూ.. నేను నా కూతుళ్ళని అడిగాను.. మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందమ్మా ఈ మూవీలో అని అడిగా. డాడీ మీరు అంత ఓవర్ యాక్షన్ చేశారు ఎందుకు అంటూ పరువు తీశారు. ఆ సినిమా వాళ్ళ మీ నాన్నకు ఎంత పేరు వచ్చిందో తెలుసా.. ఇండియా మొత్తం అప్రిషియేట్ చేశారు అని నా భార్య జీవిత పిల్లలకు చెప్పింది.
నిజమే ఓవర్ యాక్షన్ చేశా
అయినా కూడా అంకుశంలో నా యాక్టివ్ వాళ్లకు ఓవర్ గానే అనిపించింది. వాళ్ళకే కాదు చేస్తున్నప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. నేను కోడి రామకృష్ణ గారిని అడిగా. ఏంటి సార్ ఇలా ఓవర్ గా చేయడం అవసరమా అని.. దానికి ఆయన బదులిస్తూ నువ్వు టైగర్ లాంటి వాడివి అలాగే గంభీరంగా ఉండాలి అని చెప్పారు.
ఇప్పటి యువతకు నచ్చదు
ఇప్పటి యువతకి అప్పటి యాక్టింగ్ స్టైల్ నచ్చదు. ఎందుకంటే మొబైల్స్ వచ్చాక ప్రపంచాన్ని మొత్తాన్ని వాళ్ళు అరచేతుల్లోనే చూస్తున్నారు. హాలీవుడ్ సినిమాలు కూడా చూసేస్తున్నారు. కాబట్టి సినిమాల్లో కూడా వాళ్ళు రియాలిటీ కోరుకుంటున్నారు అని రాజశేఖర్ అన్నారు.

