MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • సావిత్రి కాదు మిస్సమ్మ హీరోయిన్ ఎవరో తెలుసా, ఆమెతో సగం మూవీ తీశాక రీల్ తగలబెట్టిన నిర్మాత!

సావిత్రి కాదు మిస్సమ్మ హీరోయిన్ ఎవరో తెలుసా, ఆమెతో సగం మూవీ తీశాక రీల్ తగలబెట్టిన నిర్మాత!

సావిత్రిని స్టార్ గా నిలబెట్టిన చిత్రాల్లో మిస్సమ్మ ఒకటి. కాగా ఈ చిత్రానికి మొదటగా ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకున్నారట. కొంత మూవీ షూటింగ్ జరిగాక వివాదం తలెత్తి ఆమెను తొలగించారట. ఇంతకీ ఎవరా హీరోయిన్?  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 12 2024, 01:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Missamma movie

Missamma movie

1955లో విడుదలైన మిస్సమ్మ టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్. చక్రపాణి నిర్మాతగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కింది. మిస్సమ్మ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, సావిత్రి వంటి దిగ్గజ నటులు ప్రధాన పాత్రలు చేశారు. జమున హీరోయిన్ సావిత్రికి చెల్లిగా నటించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Missamma movie

Missamma movie

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మిస్సమ్మ. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్ లు హీరోలుగా నిలదొక్కుకున్నారు. అయినప్పటికీ ఈ చిత్రంలో ఎలాంటి కమర్షియల్ హంగులు ఉండవు. చక్కని హాస్యం, భావోద్వేగాలు, గిల్లిగజ్జాలతో సాగుతుంది. సాలూరి రాజేశ్వరరావు అందించిన మ్యూజిక్ అద్భుతం అని చెప్పాలి. 

 

మిస్సమ్మలో ఎస్వీ రంగారావు, సావిత్రి నటన.. ఎన్టీఆర్, ఏఎన్నార్ లను కూడా డామినేట్ చేసేలా ఉంటుంది. సావిత్రి హీరోయిన్ గా ఎదుగుతున్న రోజుల్లో వచ్చిన మిస్సమ్మ ఆమె కెరీర్ కి చాలా ప్లస్ అయ్యింది. సావిత్రి ఇమేజ్ మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే మిస్సమ్మ లో మొదట తీసుకున్న ప్రధాన హీరోయిన్ సావిత్రి కాదు. నిర్మాతకు ఆ మూవీ హీరోయిన్ కి మధ్య తలెత్తిన వివాదం.. సావిత్రికి మేలు చేసింది. 
 

36
Missamma movie

Missamma movie

మిస్సమ్మలో మేరీ పాత్ర చేసింది సావిత్రి. ఆత్మ విశ్వాసం కలిగిన స్ట్రాంగ్ లేడీ రోల్ అది. అలాగే ముక్కోపి. ఈ పాత్రకు ఆర్ భానుమతి కరెక్ట్ అని దర్శక నిర్మాతలు భావించారు. భానుమతి అప్పటికే పరిశ్రమకు వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. మల్లీశ్వరి వంటి బ్లాక్ బస్టర్ లో ఆమె నటించారు. నిజ జీవితంలో కూడా భానుమతి వ్యక్తిత్వం.. మిస్సమ్మలో మేరీ పాత్రలా ఉంటుంది. ఆమె హీరోలను కూడా భయపెట్టేవారట. 

 

ఇక భానుమతి హీరోయిన్ గా మిస్సమ్మ షూటింగ్ కొంత మేర జరిగింది. ఇతర నటులతో కాంబినేషన్ సీన్స్ కూడా పూర్తి చేశారు. అయితే ఒకరోజు షూటింగ్ కి భానుమతి ఆలస్యంగా వచ్చిందట. నిర్మాత చక్రపాణి ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఉదయం షూటింగ్ అయితే... మధ్యాహ్నం రావడం ఏమిటీ.. క్షమాపణలు చెప్పాల్సిందే అన్నారట. 

46
Missamma movie

Missamma movie

నేను మేనేజర్ తో కబురు పంపాను ఆలస్యం అవుతుందని. కాబట్టి నా తప్పు ఏం లేదు. క్షమాపణలు చెప్పేది లేదు అన్నదట. దాంతో నిర్మాత చక్రపాణి మరింత కోపానికి గురయ్యాడట. అప్పటి వరకు షూట్ చేసిన రీల్స్ ని తగలబెట్టి, నిన్ను ఈ సినిమా హీరోయిన్ గా తప్పిస్తున్నాను, అన్నాడట. 

 

మిస్సమ్మలో మెయిన్ హీరోయిన్ పాత్ర చేస్తున్న భానుమతి స్థానంలోకి సావిత్రి వచ్చింది. లేదంటే సావిత్రి హీరోయిన్ చెల్లెలు పాత్ర చేయాల్సి వచ్చేది. ఆ పాత్ర సావిత్రికి బెస్ట్ ఫ్రెండ్ అయిన జమునకు దక్కింది. మిస్సమ్మ బ్లాక్ బస్టర్ కావడంతో... సావిత్రి, జమునలకు మంచి పేరొచ్చింది.
 

56
Missamma movie

Missamma movie

కాగా మిస్సమ్మ బెంగాలీ నవల మన్మోయి గర్ల్స్ స్కూల్ ఆధారంగా తెరకెక్కించారు. ఈ నవలను రవీంద్రనాథ్ మైత్ర రచించారు. తమిళంలో కూడా ఏక కాలంలో చిత్రీకరించారు. తమిళంలో జెమినీ గణేశన్, సావిత్రి నటించారు. మిస్సమ్మ ఎప్పుడు టీవీలో ప్రసారమైనా తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. 

 

మిస్సమ్మ కథ విషయానికి వస్తే... చిన్నప్పుడే తప్పిపోయిన జమీందారు(ఎస్వీఆర్) కూతురు మేరీ(సావిత్రి) ఓ క్రిస్టియన్ కుటుంబానికి దొరుకుతుంది. వారే పెంచి పెద్ద చేస్తారు. తన సొంత తల్లిదండ్రులు వారే అనుకుంటుంది. కుటుంబం చేసిన అప్పు తీర్చేందుకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటుంది.

66


అదే సమయంలో ఎన్ టి రావు(ఎన్టీఆర్) కూడా నిరుద్యోగిగా ఇబ్బందులు పడుతుంటాడు. మేరీ, రావుకు పరిచయం ఏర్పడుతుంది. బీఏ చదివిన భార్యాభర్తలకు స్కూల్ టీచర్స్ గా ఉద్యోగాలు ఉన్నట్లు ప్రకటన వస్తుంది. దాంతో పెళ్లి కాకుండానే ఉద్యోగం కోసం మేరీ, రావు భార్యాభర్తలుగా నటిస్తారు. మేరీ సొంత పేరెంట్స్ ఊరికే ఉద్యోగార్థం వెళతారు. తర్వాత ఏమైంది అనేది కథ.. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved