- Home
- Entertainment
- New Film Opening: విలేజ్లో హర్రర్ కథ.. కమిటీ కుర్రోడు సరికొత్త మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?
New Film Opening: విలేజ్లో హర్రర్ కథ.. కమిటీ కుర్రోడు సరికొత్త మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?
New Film Opening: `ఎస్ ఆర్ కళ్యాణమండపం` సినిమా దర్శకుడు, కమిటీ కుర్రోళ్లు మూవీలో నటించిన హీరో కలిసి రూపొందిస్తున్న కొత్త సినిమా నేడు సోమవారం ప్రారంభమైంది. ఈ మూవీ కాన్సెప్ట్ అదిరిపోయింది.

కమిటీ కుర్రోళ్ల ఫేమ్ హీరోతో.. `ఎస్ఆర్ కళ్యాణమండపం` దర్శకుడి సినిమా
కమిటీ కుర్రోళ్లు చిత్రంతో ఆకట్టుకున్న ఈశ్వర్ రాచి రాజు సోలో హీరోగా మారిపోయాడు. ఆయన హీరోగా కొత్త సినిమా నేడు ప్రారంభమైంది. ఇందులో నందు, లిఖిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో మరో విశేషం ఏంటంటే.. `ఎస్ఆర్ కళ్యాణమండపం` మూవీకి దర్శకత్వం వహించిన శ్రీధర్ గాదె ఈ సినిమాకి దర్శకత్వం వహించడం. ఇక శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ఆది సాయి కుమార్ తో చుట్టాలబ్బాయ్ వంటి ఫ్యామిలీ మూవీ, ఆనంద్ దేవరకొండతో "హైవే" వంటి యూనిక్ థ్రిల్లర్ మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే హర్రర్ స్టోరీ
సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి క్లాప్ ఇచ్చి, దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు. దర్శకుడు వీరభద్రం చౌదరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని డైరెక్టర్ కోదండ రామిరెడ్డి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. `విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే హారర్ చిత్రమిది. ఈ సినిమాను సరికొత్త కథా కథనాలతో దర్శకుడు శ్రీధర్ గాదె ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ వినూత్నంగా ఉండి ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.
ఇందులో పూజిత పొన్నాడ, సింధు కాసారం, సురేష్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్, విహా దీకొండ, సునీత మనోహర్, అమ్మ రామచంద్రయ్య వంటి వారు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సతీష్ రెడ్డి మాసం కెమెరామెన్గా, సాయికార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్గా, శ్రీధర్, వీబీజే ఎడిటర్స్ గా వ్యవహరిస్తున్నారు.

