- Home
- Entertainment
- Lenin Team Remunerations: లెనిన్ మూవీకి అఖిల్ పారితోషికం ఎంతో తెలుసా? కెరీర్ లోనే హైయ్యెస్ట్.. టీమ్ ఫీజు వివరాలు
Lenin Team Remunerations: లెనిన్ మూవీకి అఖిల్ పారితోషికం ఎంతో తెలుసా? కెరీర్ లోనే హైయ్యెస్ట్.. టీమ్ ఫీజు వివరాలు
లెనిన్ మూవీతో హిట్ అందుకున్నాడు అక్కినేని అఖిల్. ఆయన కెరీర్లో మొదటిసారి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మరి ఈ మూవీకి ఆయన ఎంత పారితోషికం తీసుకున్నాడు. టీమ్ రెమ్యూనరేషన్స్ డిటెయిల్స్.

లెనిన్ హిట్తో అక్కినేని ఫ్యామిలీలో పండగ వాతావరణం
అక్కినేని అఖిల్కి ఎట్టకేలకు కెరీర్లో తొలి విజయం దక్కింది. ఆరు సినిమాల తర్వాత ఏడో మూవీ `లెనిన్`తో ఈ బ్రేక్ వచ్చింది. ఇది అక్కినేని ఫ్యామిలీకి ఆనందకరమైన సందర్బంగా చెప్పొచ్చు. మొన్న సక్సెస్ సెలబ్రేషన్లోనే నాగార్జున ఈ విషయాన్ని చెప్పారు. తమ ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొందన్నారు. అయితే ఈ సినిమాకి అఖిల్కి ఎంత పారితోషికం ఇచ్చారు. టీమ్లో అత్యధిక పారితోషికం తీసుకున్నది ఎవరనేది చూస్తే,
అఖిల్ పారితోషికం
`లెనిన్` మూవీకి అఖిల్ కి అత్యధిక పారితోషికం ఇచ్చారు నాగార్జున. తన కెరీర్లోనే హైయ్యెస్ట్ కావడం విశేషం. ఈ చిత్రానికి ఆయనకు సుమారు రూ.8కోట్లు పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. గతంలో ఐదు కోట్ల లోపే ఆయనకు ఈ పారితోషికం దక్కింది. కానీ ఈ మూవీకి ఏకంగా ఎనిమిది కోట్లు ఇచ్చినట్టు టాక్. సినిమా హిట్ కావడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి అఖిల్ తర్వాత ఎవరు ఎంత తీసుకున్నారంటే.
లెనిన్ మూవీ టీమ్ పారితోషికాలు
`లెనిన్` మూవీకి థమన్ సంగీతం అందించాడు. ఆయన సంగీతం, బీజీఎం సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ మూవీకి ఆయనకు నాలుగు కోట్ల పారితోషికం తీసుకున్నాడట. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కోటిన్నర పారితోషికం ఇచ్చారట. సినిమాలో కీలక పాత్రలో నటించిన శివాజీకి ఎనబై లక్షలు ఇచ్చారట. అలాగే మరో కీలక పాత్రలో మెరిసి సునీల్ అరవై లక్షలు అందుకున్నట్టు సమాచారం. వీరితోపాటు మరో ముఖ్య పాత్రలో కనిపించిన ఈశ్వరీరావుకి కూడా బాగానే పారితోషికం దక్కింది. ఆమె రూ.38లక్షలు తీసుకుందట. దర్శకుడికి యాభై లక్షల నుంచి కోటి వరకు దక్కిందని సమాచారం.
బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లో వెళ్తున్న లెనిన్ మూవీ
`లెనిన్` మూవీ జులై 10న విడుదలైంది. ఇప్పుడు విజయవంతంగా రన్ అవుతుంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యింది. మూడో వారంలోనూ డీసెంట్ నెంబర్స్ ని సొంతం చేసుకుంది. ఇది వంద కోట్ల దిశగా వెళ్తుందని టీమ్ ప్రకటించింది. మరి ఎంత వరకు వెళ్తుందో చూడాలి. ఈ చిత్రంలో అఖిల్ హీరోగా నటించగా, మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. శివాజీ, సునీల్, ఈశ్వరీ రావు, ప్రమోద్, గెటప్ శ్రీను వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని నాగవంశీ, నాగార్జున సంయుక్తంగా నిర్మించారు.

