- Home
- Entertainment
- Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Anasuya Bharadwaj: భర్త మరణించిన తర్వాత మహిళలు బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలంటూ అనసూయ ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. తరచుగా అనసూయ బోల్డ్ గా మాట్లాడడం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం.

Anasuya
అనసూయ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో దుమారం రేపారు. తరచుగా అనసూయ బోల్డ్ గా మాట్లాడడం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. భర్త మరణిస్తే భార్య గాజులు, బొట్టు ఎందుకు తీసేయాలి అంటూ అనసూయ సూటిగా ప్రశ్నించారు. అసలు ఈ రూల్ ఎలా వచ్చింది అంటూ అనసూయ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
భర్త చనిపోతే బొట్టు తీసేయాలా ?
చాలా రోజులుగా నన్ను ఒక ప్రశ్న తినేస్తోంది. దీనిపై క్లారిటీ కోసం అడుగుతున్నా. మా అమ్మ చాలా అందంగా ఉంటుంది. బొట్టు, గాజులు, గజ్జలు పెట్టుకుని మా అమ్మ చాలా అందంగా ఉండేది. కానీ నాన్న చనిపోయాక ఆమె జీవితం మారిపోయింది. భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలి కదా. కానీ బొట్టు పెట్టుకోవడం, కాటుక, గాజులు, గజ్జలు ఇవ్వన్నీ పెట్టుకోవడం మా అమ్మకి అమ్మమ్మ నేర్పింది. నాకు మా అమ్మ నేర్పింది.
ఆడవాళ్ళ వ్యక్తిగతమైన ఇష్టాలు
ఎవరికైనా వాళ్ళ అమ్మలే ఇవన్నీ నేర్పుతారు. కానీ భర్త చనిపయినప్పుడు వాటిని ఎందుకు వదిలేయాలి. ఒక వేళ వదిలేయాల్సి వస్తే మా అమ్మమ్మ చనిపోయినప్పుడు వదిలేయాలి కదా. నాన్న కోసం ఎందుకు వదిలేసింది అంటూ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేశారు. బొట్టు, గాజులు, గోరింటాకు లాంటి వాటిని పెళ్లితో ఎందుకు ముడిపెట్టారు. అవన్నీ ఆడవాళ్ళ వ్యక్తిగత ఇష్టమైనవి కదా అంటూ అనసూయ ప్రశ్నించింది. నేను ఎవరికీ వ్యక్తిరేకంగా మాట్లాడడం లేదు. కానీ నాకు వచ్చిన డౌట్ ని ప్రశ్నిస్తున్నా.
బలవంతమైన రూల్స్
పూజలు చేస్తున్నప్పుడు కూడా కొన్ని బలవంతమైన రూల్స్, ఆచారాలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు పాటించాలి, ఎక్కడ రాసి ఉన్నాయి అంటూ అనసూయ సంచలన కామెంట్స్ చేసింది.
మరో వివాదం షురూ
ఇటీవల జైశ్రీరామ్ నినాదంపై అనసూయ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ వివాదాన్ని నెటిజన్లు మర్చిపోక ముందే మరోసారి అనసూయ కొత్త కాంట్రవర్సీతో వచ్చేసింది. ఈసారి నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

