రానా 'హిరణ్యకశిప': ఈ షాకింగ్ న్యూస్ నిజమేనా?
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ గత కొంతకాలంగా ఓ పౌరాణిక చిత్రం ప్లానింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రహ్లాదుడి కథతో హిరణ్యకశ్యప అనే టైటిల్ తో ఓ సినిమాను తెరకెక్కించటానికి గత రెండేళ్లుగా పనులు చేస్తున్నారు.
సన్నబడ్డ రానాతో కష్టమే.... టాలీవుడ్ హంక్ రానా దగ్గుపాటి గత కొద్ది రోజులుగా ఇండియాని వదిలి అమెరికాలో కిడ్ని కు సంభందించిన ట్రీట్మెంట్ తీసుకున్నారని వార్తలు వస్తున్న విషయం విదితమే. ఆ విషయం నిజమే అన్నట్లుగా రానా లుక్ చాలా సన్నగా ఉన్న ఫొటోలు బయిటకు వచ్చాయి. దాంతో హిరణ్యకశిప పాత్ర కు సరిపడ బాడీ కావాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు రానా ఉన్న పరిస్దితుల్లో అది సాధ్యమయ్యే పనికాదు అని తెలుస్తోంది. దాంతో సురేష్ బాబు ఈ ప్రాజెక్టుని ప్రక్కన పెట్టినట్లు చెప్పుకుంటున్నారు.
అబ్బే అలాంటిదేం లేదు: అయితే సురేష్ బాబు సన్నిహితులు మాత్రం అలాంటిదేమీ లేదు. ఇవన్నీ ఆధారం లేని రూమర్సే అని కొట్టి పారేస్తున్నారు. మూడు సంవత్సరాల ప్రి ప్రొడక్షన్ వర్క్ ఈ సినిమా కోసం జరిగింది. ఇప్పటికిప్పుడు ఆ సినిమాని కనుక ఆపేస్తే చాలా నష్టం. సురేష్ బాబు అలాంటి పని ఎప్పటికి చేయరని అంటున్నారు. అయితే ఇప్పుడు వేరే హీరోతో ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్తారని కూడా వార్తలు వస్తున్నాయి.
భారి బడ్జెట్...ఇక ఈ పౌరాణిక గాథను దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. దగ్గుపాటి రానా ఈ సినిమాలో టైటిల్ రోల్ లో నటించటమే కాదు తానే స్వయంగా నిర్మిస్తున్నాడు కూడా. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. ఇప్పటికే చాలా సెట్లు ఈ సినిమా కోసం నిర్మాణమవుతున్నాయి. వాటిని సురేష్ బాబు పర్యవేక్షిస్తూ మరో ప్రక్క స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారు.
విఎఫ్ ఎక్స్ పనులు మొదలయ్యాయి:అలాగే ఈ సినిమాకోసం అంతర్జాతీయంగా 17 స్టూడియోలు దాకా విఎఫ్ ఎక్స్ పనిలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీ,నటులు, టెక్నీషియన్స్ ఎంపిక జరుగుతోంది. ఈ సినిమా కోసం రానా భారీగా రాక్షసుడు లా తన లుక్ ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఆ మార్క్ కోసం తప్పదు:అయితే మార్కెట్ పరంగా గుణశేఖర్గాని, రానా గాని సోలోగా ఇంతవరకు వంద కోట్లమార్క్ను అందుకోలేదు. అందుకే అంత బడ్జెట్తో హిరణ్యకశ్యపను తెరకెక్కించటం సాహసమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయినా టైటిల్ రోల్లో మహా రాక్షసుడు హిరణ్యకశ్యపునిగా మెప్పించేందుకు ఆహార్యం, వాచికం విషయంలో ఇప్పటికే రానా ప్రత్యేక కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది.
వరస ప్రాజెక్టులతో ..ఇప్పటికే రానా చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. 'హాథీ మేరె సాథీ'.. '1945' లతో పాటుగా 'విరాటపర్వం' షూటింగ్ దశలో ఉన్నాయి. . నీదీ నాది ఒకటే కథ వంటి డిఫరెంట్ సినిమాతో పరిచయమైన దర్శకుడు వేణు ఊడుగల డైరక్ట్ చేస్తున్న చిత్రం ఇది. వచ్చేవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతున్న చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించనున్నారు.
బ్లాక్ మ్యాజిక్ తో ..రానా మరో కొత్త చిత్రం కమిటైనట్లు సమాచారం. గతంలో సిద్దార్దతో గృహం అనే చిత్రం తీసిన మిలింద్ రావు దర్శకత్వంలో రూపొందనుంది. ఇదో హర్రర్ సినిమా. ఈ సినిమాతో రానా ఓ రేంజిలో భయపెట్టనున్నారట. భారత దేశంలో పురాతన విద్య అయిన చేతబడి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని తెలుస్తోంది. ఇది పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుందని రానా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని సీనియర్ నిర్మాత ఆచంట గోపీనాధ్ నిర్మించనున్నారు. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.