MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • గాయం చేసి, నొప్పి తెలియకుండా మందు రాసినట్టు... ఘోర ఓటముల తర్వాత సెంచరీలా! కోహ్లీ, సూర్య, ఇషాన్...

గాయం చేసి, నొప్పి తెలియకుండా మందు రాసినట్టు... ఘోర ఓటముల తర్వాత సెంచరీలా! కోహ్లీ, సూర్య, ఇషాన్...

గాయం చేసి నొప్పి తెలియకుండా మందు రాయడం ఓ పెద్ద ఆర్ట్. ఇప్పుడు టీమిండియా చేస్తున్నది కూడా ఇదేనంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. చిత్తుగా ఓడిన తర్వాత చెత్తగా ఆడుతున్నారని విమర్శలు రాగానే... ఆ తర్వాతి మ్యాచ్‌లో సెంచరీలు బాది, అభిమానులను సైలెంట్ చేస్తోంది టీమిండియా... ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి ఇదే సీన్ రిపీట్ అవుతూ వస్తోంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 10 2022, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
India vs Pakistan

India vs Pakistan

ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియానే టైటిల్ విజేత అని ఫిక్స్ అయ్యారు అభిమానులు. వరుసగా ద్వైపాక్షిక సిరీసులు గెలుస్తూ వస్తున్న రోహిత్ సేన జోరుకి బ్రేకులు వేయ్యడం ఎవ్వరి వల్లా కాదనుకున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో చిత్తుగా ఓడింది టీమిండియా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
virat kohli

virat kohli

టీమిండియా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్ అండ్ కో తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేశారు. ఈ సమయంలో ఆఫ్ఘాన్‌పై సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ. మూడేళ్లుగా 71వ సెంచరీని అందుకోలేకపోతున్న విరాట్.. ఆఫ్ఘాన్‌పై శతకం బాదడంతో అప్పటిదాకా టీమిండియా ప్రదర్శనపై వచ్చిన విమర్శలకు ఫుల్‌స్టాప్ పడింది...

310

టీమిండియా పరాజయాన్ని మరిచిపోయి విరాట్ కోహ్లీ సెంచరీ గురించి, అతని వీరోచిత బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా గ్రూప్ స్టేజీలో బాగానే ఆడింది. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూసింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మినహా భారత బ్యాటింగ్, బౌలింగ్ విభాగం ఘోరంగా ఫెయిల్ అయ్యింది...

410

టీమిండియా ఘోర ప్రదర్శన గురించి, రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి... హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రయోగాలతో టీమ్‌ని నాశనం చేస్తున్న విధానం గురించి తీవ్రమైన చర్చ జరిగింది. రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుని హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ వినిపించింది...

510

సరిగ్గా ఇదే సమయంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో సెంచరీతో చెలరేగాడు సూర్యకుమార్ యాదవ్. అంతకుముందు ఇంగ్లాండ్ టూర్‌లో సెంచరీ బాదిన సూర్య, కివీస్‌పై సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడడంతో టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో టీమిండియా పరాభవాన్ని మరిచిపోయారు అభిమానులు...
 

610
Rohit Sharma

Rohit Sharma

న్యూజిలాండ్ టూర్ తర్వాత బంగ్లాలో అడుగుపెట్టిన భారత జట్టు, తొలి రెండు వన్డేల్లో చిత్తుగా ఓడి సిరీస్ కోల్పోయింది. భారత జట్టు, మరీ బంగ్లా చేతుల్లో ఇలా ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. తొలి వన్డేలో ఆఖరి వికెట్ తీయలేక ఓడిన టీమిండియా, రెండో వన్డేలో ఆఖరి బంతికి 6 కొట్టలేక ఓడింది...

710
ishan

ishan

రెండో వన్డేలో గాయపడిన తర్వాత క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ, ట్రోలింగ్ నుంచి తప్పించుకున్నాడు. రోహిత్ వీరోచిత పోరాటం వల్ల టీమిండియా చెత్త ఆటను పట్టించుకోలేదు అభిమానులు. బంగ్లాపై సిరీస్ ఓడిపోయి, తీవ్ర విమర్శలు వచ్చిన సమయంలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు...

810

వచ్చిన బంతిని వచ్చినట్టు బౌండరీ అవతల పడేసి 24 ఏళ్ల వయసులోనే కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడేశాడు. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ డబుల్ సెంచరీ, సెంచరీల హడావుడిలో బంగ్లాతో వన్డే సిరీస్ ఓడిన విషయాన్ని మరిచిపోయారు అభిమానులు...

910
Suryakumar Yadav

Suryakumar Yadav

చూస్తుంటే గెలవాల్సిన మ్యాచుల్లో ఆడలేక చేతులు ఎత్తేసి...  జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయాక, మేం ఆడగలమని నిరూపించుకోవడానికి సెంచరీలు కొడుతున్నట్టుగా టీమిండియా ఆటతీరు ఉందని ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు. క్రికెటర్ అభిమానులకు తమ ఫెవరెట్ క్రికెటర్ సెంచరీ చేస్తే చాలు, కానీ టీమిండియా ఫ్యాన్స్‌కి జట్టు గెలవడం కూడా కావాలి...

1010

మూడో వన్డేలో మనోళ్లు ఇరగదీశారు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించి, వన్డేల్లో తానేం చేయగలడో నిరూపించుకున్నాడు. అయితే రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కోలుకున్నాక, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ తిరిగి వచ్చాక ఇషాన్ కిషన్‌కి టీమ్‌లో చోటు ఉంటుందన్న గ్యారెంటీ ఉందా? అది ఆ అమిత్ షా కొడుక్కి మాత్రమే తెలుసేమో...  అంటున్నారు నెటిజన్లు.

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved