Zodiac signs: మిథున రాశిలోకి బుధుడు.. ఈ 3 రాశుల కష్టాలన్నీ తీరినట్లే..!
జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కో గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత రాశులు, నక్షత్రాలు మారుస్తుంటాయి. దానివల్ల 12 రాశి చక్రాలపై ప్రభావం పడుతుంది. బుధుడు తన సొంత రాశిలోకి త్వరలో ప్రవేశించనున్నాడు. దీనివల్ల భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం 3 రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఆ రాశులెంటో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం బుధ గ్రహం మీన రాశిలో ఉంది. జూన్ 6న మిథున రాశిలోకి మారుతుంది. దీనివల్ల భద్ర రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం జూన్ 22 వరకు ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం భద్ర రాజయోగం వల్ల 3 రాశులవారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఆ రాశులెంటో.. అందులో మీ రాశి ఉందో ఒకసారి చెక్ చేస్కోండి.

కన్య రాశి
కన్యా రాశి వాళ్లకి భద్ర రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవాళ్లకి జీతం పెరుగుతుంది. ప్రమోషన్ కూడా వస్తుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
మిథున రాశి
మిథున రాశి వాళ్లకి భద్ర రాజయోగం అదృష్టాన్ని తెస్తుంది. పెళ్లైన వారి జీవితం సూపర్ గా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు ఊపందుకుంటాయి. చాలా రోజులుగా అనుకుంటున్న ప్లాన్స్ కొత్త రూట్లోకి వస్తాయి. పనులు చకచక పూర్తవుతాయి.
తుల రాశి
భద్ర రాజ యోగం తులా రాశి వాళ్లకి బాగా కలిసి వస్తుంది. అదృష్టం వారి వెంటే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఉద్యోగులకి సాలరీ పెరుగుతుంది. ఇంటి వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. పిల్లల చదువు, ఉద్యోగం విషయాల్లో శుభవార్తలు వింటారు.