తమిళ స్టార్ కమెడియన్ వడివేలు ఇంట్లో విషాదం, పలువురు ప్రముఖుల సంతాపం
కోలీవుడ్ స్టార్ కమెడియన్.. సీనియర్ నటులు వడివేలు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ.. వడివేలు తల్లి కన్ను మూశారు.
ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలు తల్లి పాప(87) కన్ను మూశారు. కొంత కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుది స్వాస విడిచారు. మధురై దగ్గర్లోని సొంతూరు విరగానూర్ లో ఉంటున్న ఆమె.. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యల వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గత రాత్రి పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు విడిచారు. అయితే ఈ వార్త తెలియగానే అప్పటికే ఓ సినిమా షూటింగ్ లో ఉన్న వడివేలు.. వెంటనే తన ఊరికి వెళ్లిపోయారు.
ఇక వడివేలు తల్లి చనిపోయారన్న విషయం తెలియగానే తమిళనాడులో పలువురు నటీనటులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. కొంత మంది వడివేలుకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. మరికొంత మంది సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా తమ సంతాపంప్రకటిస్తున్నారు. అయితే వడివేలు మాతృమూర్తి అంత్యక్రియటు నేటి సాయంత్ర జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కొంత మంది కోలీవుడ్ నుటు హాజరు కానున్నారనని సమాచారం.
తమిళంతో పాటు తెలుగులోను హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు వడివేలు. డైరెక్ట్ గా తెలుగు సినిమాలు చేయకపోయినా.. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా ఆయన క్రేజ్ సాధించాడు. స్పెషల్ మానరిజంతో తమిళ నాట స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. తెలుగులో బ్రహ్మానందంకు ఉన్న క్రేజ్.. తమిళనాట వడివేలుది. అయితే పలు కారణాల వల్ల వడివేలుపై తమిళ ఇండస్ట్రీలో నిషేధం విధించారు. దీంతో ఈయన కొన్నేళ్లపాటు సినిమాలకు దూరం అయ్యారు. మళ్లీ కొంత కాలం క్రితమే రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. నాయి శేఖర్ రిటర్న్స్ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన.. ప్రస్తుతం చంద్రముఖి 2లో నటిస్తున్నారు.