ప్రభాస్- దిల్రాజు భారీ చిత్రం..క్రేజీ డైరక్టర్ తో ?
క్రేజీ కాంబినేషన్ లు సెట్ చేయటంలో దిల్ రాజుని మించిన వాళ్లు లేరు. అందుకే ఆయన సినిమాలు భాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధిస్తూంటాయి. తాజాగా ప్రభాస్ తో ఆయన ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. గతంలోనూ ఆయన ప్రభాస్ తో సినిమా చేసారు కానీ ఈ సారీ ఓ క్రేజీ కాంబోని సెట్ చేసినట్లు సమాచారం.
క్రేజీ కాంబినేషన్ లు సెట్ చేయటంలో దిల్ రాజుని మించిన వాళ్లు లేరు. అందుకే ఆయన సినిమాలు భాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధిస్తూంటాయి. తాజాగా ప్రభాస్ తో ఆయన ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. గతంలోనూ ఆయన ప్రభాస్ తో సినిమా చేసారు కానీ ఈ సారీ ఓ క్రేజీ కాంబోని సెట్ చేసినట్లు సమాచారం.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కె.జి.ఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారు. 2019లో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు లేవు కానీ .. 2020లో ఖచ్చితంగా ప్రారంభం అవుతుందని వినికిడి. ఆ మేరకు ప్రారంభ డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది.
గతంలోనే ఇదే దర్శకుడుతో ప్రభాస్ హీరోగా ఓ ప్రాజెక్టుని దిల్ రాజు ప్లాన్ చేసారు. కానీ ముందుకు వెళ్లలేదు. కానీ ఈ సారి ఖచ్చితంగా ఈ కాంబోతో పెద్ద హిట్ కొట్టాలని ఆయన భావిస్తున్నారు. కోలార్ బంగారు గనులు, భారీ మాఫియా బ్యాక్ డ్రాప్తో తెరకెక్కించిన `కె.జి.ఎఫ్` ఇటు సౌత్, అటు నార్త్ రెండుచోట్లా ఘనవిజయం సాధించటమే అందుకు కారణం. కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ పేరు సౌత్ లో మార్మోగిపోతోంది.
ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో దాదాపు 200కోట్ల బడ్జెట్ తో అసాధారణ చిత్రం తెరకెక్కించాలన్న ప్లాన్ దిల్ రాజు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ ప్రభాస్ ని దర్సకుడు కలవటం జరిగిందని చెబుతున్నారు. ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం కె.జి.ఎఫ్ డైరెక్టర్ ఈ ప్రాజెక్టుపై చాలా ఇంట్రస్ట్ గా ఉన్నారు.. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.
మరోవైపు ప్రభాస్ సాహో, జాన్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆగస్టు లో సాహో, ఏడాది చివరిలో జాన్ చిత్రాలు రిలీజైతే అతడికి పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్సుంటుందని చెబుతున్నారు.