యూట్యూబ్ కొత్త సీఈఓగా భారతీయ సంతతికి చెందిన నీల్ మోహన్ నియమితులయ్యారు. 2013లో మోహన్ యూట్యూబ్ ద్వారా రూ.544 కోట్లు సంపాదించారు. బోనస్ వచ్చింది. కానీ, కెరీర్ ప్రారంభించినప్పుడు అతని జీతం ఎంతో తెలుసుకుంటే షాక్ తింటారు.
యూట్యూబ్ సీఈఓగా భారతీయ అమెరికన్ నీల్ మోహన్ నియమితులవడంతో భారతీయులంతా మరోసారి గర్వంతో పొంగిపోతున్నారు. యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నుండి ప్రస్తుతం ఈ పదవికి నీల్ మోహన్ పదోన్నతి పొందాడు. యూట్యూబ్ సీఈఓగా సుసాన్ వోజ్కికీ రాజీనామా చేసిన తర్వాత ఆమె స్థానంలో నీల్ మోహన్ ఎంపికయ్యారు. సుసాన్ వోజ్కికీ టెక్నాలజీలో అగ్రగామి మహిళల్లో ఒకరు. కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల 54 ఏళ్ల వోజ్కికీ రాజీనామా చేశారు. వోజ్కికీ 2014 నుండి యూట్యూబ్ సీఈఓగా కొనసాగుతున్నారు. నీల్ కూడా చాలా సంవత్సరాలు వోజ్కికీతో కలిసి పనిచేశాడు.
యూట్యూబ్ షార్ట్స్, లైవ్ స్ట్రీమింగ్, సబ్స్క్రిప్షన్ సేవలను పరిచయం చేయడంలో మోహన్ కీలక పాత్ర పోషించారు. అంతే కాదు మోహన్ సారథ్యంలో సంస్థకు మంచి రోజులు రానున్నాయని సుసాన్ అభిప్రాయపడ్డారు.నీల్ మోహన్ 2013లోనే యూట్యూబ్ నుండి రూ. 544 కోట్లు బోనస్ పొందినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే మోహన్ తన కెరీర్ లో మొదటి జీతం ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మోహన్ అమెరికాలో నెలకు కేవలం రూ. 2.15 లక్షల వేతనంతో కెరీర్ ప్రారంభించాడు.
స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ అయిన నీల్ మోహన్ గ్లోరిఫైడ్ టెక్నికల్ సపోర్టులో నెలకు రూ.2.15 లక్షలు. జీతంతో కెరీర్ ప్రారంభించారు. అంతేకాదు యాక్సెంచర్లో కూడా మోహన్ సీనియర్ అనలిస్ట్గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత Double Click Inc అనే కంపెనీలో పనిచేశాడు. ఈ సంస్థలో అతని కెరీర్ చాలా వృద్ధి చెందింది. కేవలం మూడు సంవత్సరాల ఐదు నెలల్లో గ్లోబల్ క్లయింట్ సర్వీసెస్ డైరెక్టర్గా నియమితులయ్యారు.
తర్వాత 2008లో Double Click Inc కంపెనీని గూగుల్ కొనుగోలు చేసింది.ఈ ఒప్పందం తర్వాత గూగుల్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా చేరారు. 2015లో మోహన్ యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత యూట్యూబ్ సీఈవో స్థాయికి ఎదిగారు. 2013లో యూట్యూబ్ నుంచి మోహన్ రూ.544 కోట్ల. బోనస్ అందుకున్నారు. అప్పటి నుండి మోహన్ సంస్థ స్టార్ పెర్ఫార్మర్గా గుర్తింపు పొందాడు.
ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలకు భారత సంతతికి చెందిన సీఈవోలు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఆ వరుసలో నీల్ మోహన్ కూడా చేరాడు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ భారతీయ సంతతికి చెందినవారే కావడం విశేషం. IT కంపెనీలే కాకుండా, అమెరికన్ మూలానికి చెందిన కొన్ని ఇతర ప్రముఖ కంపెనీలు కూడా భారతీయ సంతతికి చెందిన CEOల నేతృత్వంలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ కాఫీ షాప్ స్టార్ బక్స్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్ సుబ్రహ్మణ్యం ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా సేవల సంస్థ అయిన ఫెడెక్స్కు CEOగా పనిచేస్తున్నారు. మొత్తం మీద అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీలు భారతీయ సంతతికి చెందిన వారిని నియమించుకోవడం, భారతీయుల మేనేజ్ మెంట్ స్కిల్స్ కు ప్రతీక అని నిపుణులు చెబుతున్నారు.