భూటాన్, చైనా సరిహద్దు వివాదం విషయమై భారత ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ పర్యటన ప్రాముఖ్యత కలిగిందని మేజర్ జనరల్ సుధాకర్ జీ తెలిపారు. ప్రధాని పర్యటన సున్నితమైందని, భద్రతాపరంగా ప్రాముఖ్యమైందని, అలాగే చాలా ముఖ్యమైనదనీ వివరించారు.
డాక్టర్ బండారి సుజాత పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం హన్మకొండలో పలువురు ప్రముఖ కవులు, రచయితలు, విమర్శకుల సమక్షంలో జరిగింది. ఆమె కవితా సంపుటి వేకువ పుష్పం, కథా సంపుటి వెలుతురు చూడని యెన్నియలు ఆవిష్కరించారు.
అనంతపురం రచయితల సంఘం జడిగం కవితా సంకలనం ముఖ చిత్రాన్ని ఆవిష్కరించారు.
భారత ప్రధాని భూటాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భూటాన్ రాజు ఆ దేశపు అత్యున్నత పౌర పురస్కారం డ్రూకో గ్యాల్పోతో భారత ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించారు.
హెచ్ఐవీకి డచ్ శాస్త్రవేత్తలు విరుగుడు కనిపెట్టారు. సీఆర్ఐఎస్పీఆర్ అనే సాంకేతికత పరిజ్ఞానంతో హెచ్ఐవీని పూర్తిగా నయం చేయవచ్చని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కీలక కుట్రదారుడని ఈడీ పేర్కొంది. లిక్కర్ పాలసీ స్కాంలో కింగ్ పిన్ అని కోర్టుకు తెలిపింది. కాబట్టి, సీఎంను పది రోజులు రిమాండ్కు పంపాలని విజ్ఞప్తి చేసింది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురు అభ్యర్థులను ఖరారు చేసింది.
ఈడీ అధికారులు గురువారం సాయంత్రం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సోదాలు జరిపారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయనను అరెస్టు చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు మొదలు పెట్టారు. సెర్చ్ వారెంట్తో చేరుకున్న ఈడీ టీమ్ కేజ్రీవాల్, ఆయన కుటుంబానికి చెందిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కాగా, కేజ్రీవాల్ టీమ్ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. చెన్నై సౌత్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిగా బీజేపీ తన మూడో జాబితాలో వెల్లడించింది.