అనంతపురం రచయితల సంఘం జడిగం కవితా సంకలనం ముఖ చిత్రాన్ని ఆవిష్కరించారు.

జిల్లా రచయితల సంఘం, అనంతపురం ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా త్వరలో వెలువడనున్న"జడిగం" కవితా సంకలనానికి సంబంధించిన
ముఖచిత్రం ఆవిష్కరించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అనంతపురం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా త్వరలో వెలువడనున్న కవితా సంకలనానికి సంబంధించిన ముఖచిత్రాన్ని ఆ సంఘం ఆవిష్కరించింది. స్థానిక అనంతపురం టవర్ క్లాక్ సెంటర్లో సీనియర్ రచయిత,కథకులు, నవలాకారులు, వైయస్సార్ లైవ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత డాక్టర్ శాంతి నారాయణ జడిగం కవితా సంకలనం ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు. మరో అతిధిగా సీనియర్ రచయిత, కవి తూముచర్ల రాజారాం హాజరై మాట్లాడారు. వర్తమాన అనంత కవిత్వాన్ని సంకలనం చేయాలనే జిల్లా రచయితల సంఘం ప్రయత్నాన్ని వారు అభినందించారు. 

ఈ సంకలనాన్ని "జడిగం" పేరుతో తీసుకురావడం పట్ల శాంతి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. అనంత రైతుకు సంకేతంగా ఈ పేరు కనిపిస్తోందని వారన్నారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ జన్నె ఆనంద్ కుమార్, కొత్తపల్లి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వర్తమాన కవులు మధుర శ్రీ, సురగౌని రామకృష్ణ, నానీల నాగేంద్ర, కోటిగారి వన్నప్ప, గోసల నారాయణస్వామి, మిద్దె మురళీకృష్ణ, విధురా రెడ్డి, చేగువేరా హరి, ఈరన్న, వలస రమేష్, లక్ష్మి శ్యామ్, శంకర నారాయణ, కిషోర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.