Asianet News TeluguAsianet News Telugu

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో   పలువురు టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో  గురువారం నాడు సమావేశమయ్యారు. పలువురు టీడీపీ నేతలు భీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకొంది.
 

tdp leaders secret meeting at kakinada in east godavari district
Author
Amaravathi, First Published Jun 20, 2019, 1:44 PM IST

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో   పలువురు టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో  గురువారం నాడు సమావేశమయ్యారు. పలువురు టీడీపీ నేతలు భీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకొంది.

తూర్పు గోదావరి జిల్లా  కాకినాడలో టీడీపీ నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో  టీడీపీ  ఘోరంగా పరాజయం పాలైంది. టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే  స్థానాలకే పరిమితమైంది. టీడీపీ 3 ఎంపీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 

మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో టీడీపీ నేతలు సమావేశమైనట్టుగా తెలుస్తోంది.ఈ సమావేశానికి వేదవ్యాస్, బొండా ఉమ, బడేటి బుజ్జి, కదిరి బాబురావు, చెంగల్రాయుడు, మాధవనాయుడు, జ్యోతుల నెహ్రు, ఈలినాని, మీసాల గీత, వరుపుల రాజా, కేఏనాయుడు, పంచకర్ల రమేష్ బాబు తదితరులు హాజరైనట్టుగా తెలుస్తోంది. దాదాపు 20 మంది నేతలు సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఉన్నారు ఈ  నేతలు ఎందుకు సమావేశమయ్యారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి  ఉంది. బీజేపీ వైపు ఈ నేతలు చూస్తున్నారా... ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని సర్వత్రా చర్చ సాగుతోంది.

ఈ నేతలు బీజేపీలో చేరడానికే వారు మొగ్గు చూపుతున్నారనే చర్చ సాగుతోంది.  అయితే ఈ సమావేశం తర్వాత  టీడీపీ నేతలు ఏం చెబుతారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....

Follow Us:
Download App:
  • android
  • ios