ప్రేమ పెళ్లి: 15 ఏళ్ల తర్వాత భర్త మృతి, ఏమైందంటే?
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలోని చెల్లూరి రాంబాబు అనుమానాస్పదస్థితిలో మరణించాడు. రాంబాబు తండ్రి మాత్రం తన కొడుకుని హత్య చేశారని రాంబాబు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలోని చెల్లూరి రాంబాబు అనుమానాస్పదస్థితిలో మరణించాడు. రాంబాబు తండ్రి మాత్రం తన కొడుకుని హత్య చేశారని రాంబాబు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలోని చెల్లూరి రాంబాబు 15 ఏళ్ల క్రితం అదే వీధిలో నివాసం ఉండే క్రాంతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. వీరికి ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. అయితే ఏడాది కాలంగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఈ విషయమై పోలీసులు కూడ కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఆదివారం నాడు ఉదయం రాంబాబు మంచం నుండి లేవడం లేదని... అతని నోటి నుండి రక్తం వస్తోందని ఆయన భార్య క్రాంతి స్థానికులకు చెప్పింది. దీంతో రాంబాబును ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాంబాబు మరణించాడని వైద్యులు ప్రకటించారు.
అయితే రాంబాబు మృతిపై ఆయన తండ్రి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. రాంబాబు భార్యపైనే ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు పోలీసులకు కూడ ఫిర్యాదు చేశాడు.
డబ్బుల విషయంతో పాటు ఓ స్థలం తన పేరున చేయించాలని భార్య క్రాంతి భర్త రాంబాబుతో గొడవకు దిగుతోందని రాంబాబు తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ వార్తలు చదవండి
ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్
బ్యూటీషీయన్ కేసు: పద్మపై నూతన్ కుమార్ భార్య సంచలనం
దారుణం: కూతుళ్లపై ఏడాదిగా తండ్రి రేప్, దిమ్మ తిరిగే షాకిచ్చిన భార్య
వివాహేతర సంబంధం: బెలూన్తో భార్య, కూతురును చంపాడు
ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా...
అసహజ శృంగారం: భార్యకు వేధింపులు, ఆత్మహత్యాయత్నం
వివాహిత స్నానం చేస్తుండగా వీడియో, రేప్: బాధితురాలు ఏం చేసిందంటే?
ట్రయాంగిల్ లవ్స్టోరీ: మూడో లవర్తో ఎంజాయ్, ఇద్దరు లవర్లకు,భర్తకు షాక్
భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు
వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య
రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు